Chandra Babu : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కాం డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి 52 రోజుల పాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే.తాజాగా ఆయన అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారు. మంగళవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు అడుగు పెట్టడంతో అధినేతను చూసి పార్టీ నేతలు, కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు గేటు నుంచి బయటకు రాగానే మనవడు దేవాన్ష్ను దగ్గరకు తీసుకుని హత్తకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్ని ఆప్యాయంగా పలకరించారు. జైలు దగ్గర కొద్దిసేపు ఎమోషనల్ సీన్ కనిపించింది.
జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే నారా బ్రాహ్మణి, నందమూరి బాలయ్యలు చంద్రబాబుకు ఓ పసుపు సంచిని అందజేశారు. దీంతో ఆ సంచిలో ఏముందనే చర్చ జరిగింది.. ఆ తర్వాత ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. నందమూరి బాలయ్య చంద్రబాబు క్షేమం కోరుతూ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడులోని ఆలయాల్లో కూడా ప్రత్యేకంగా పూజలు చేయించారు. ఈ క్రమంలో తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాల్లో సోమవారం చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు చేయించిన నందమూరి బాలయ్య.. ఆ ఆశీర్వాద ఫలాన్ని అధినేతకు అందజేశారు. అనంతరం చంద్రబాబుకి పాదాభివందనం చేశారు బాలయ్య. రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబుకు దారి పొడవునా తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు టిడిపి శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు అంటూ పేర్కొన్న ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చూపించిన మద్దతు ఎప్పటికీ మరిచిపోను అన్నారు. మీరు చూపిస్తున్న అభిమానాన్ని మర్చిపోలేనని పేర్కొన్న చంద్రబాబు రోడ్డుపైకి వచ్చి మీరు తెలిపిన సంఘీభావం, నా కోసం మీరు చేసిన పూజలు ఎప్పుడు మరిచిపోను అన్నారు. తనకు సంఘీభావం తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును కొనియాడారు. సీపీఐ, బీఆర్ఎస్, కొంత మంది కాంగ్రెస్ నాయకులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. 53 రోజుల జైలు జీవితంలో తాను అభివృద్ధి కోసం చేసిన పనులను, నాటి కష్టాన్ని నేమరువేసుకున్నానని అన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…