Chandra Babu : స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్ ద్వారా 52 రోజుల తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు ఆసుపత్రులు తిరుగుతూ బిజీగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఆయనకు బెయిల్ రాగా, ఇప్పుడు తన అనారోగ్యంకి సంబంధించి చికిత్స తీసుకుంటున్నాడు. క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న ఆయన గతంలో ఓ కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. తాజాగా రెండో కంటికి చేయించుకున్నారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ కు సంబంధించిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. శస్త్రచికిత్స పూర్తయ్యాక చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తుండడం ఆ ఫొటోలో చూడొచ్చు. కాగా, ఆపరేషన్ పూర్తయ్యాక చంద్రబాబు తన నివాసానికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ను ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయి నవంబర్ 8న రిజర్వ్ కాబడింది. మరోవైపు బెయిల్ పిటీషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించగా ఏపీ హైకోర్టు నవంబర్ 28కు వాయిదా వేసింది. ఈలోగా ఆరోగ్య కారణాలతో ముఖ్యంగా కుడి కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ పెండింగు ఉందని చెబుతూ మద్యంతర బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు కంటి ఆపరేషన్ నిమిత్తం నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది. తిరిగి నవంబర్ 28న జైలులో లొంగిపోవల్సి ఉంది.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అంతేకాకుండా చర్మ ఎలర్జీకు సంబంధించిన వైద్యం కూడా తీసుకున్నారు. నవంబర్ 2న ఏఐజీ ఆసుపత్రిలో చేరి ఒక రోజంతా అక్కడే ఉండి వివిధ పరీక్షలు చేయించుకున్నారు. ఆ తరువాత గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాల వైద్యులు పరీక్షలు చేశారు. బ్లడ్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, 2డీ ఈకో, అలర్జీ స్క్రీనింగ్, ఈసీజీ, లివర్, కిడ్నీ ఫంక్షనింగ్ పరీక్షలు పూర్తి చేశారు. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు ఆయనకు చర్మ ఎలర్జీ సంభవించింది.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…