Bhanu Sree Mehra : ‘వరుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ భానుశ్రీ మెహ్రా..అందం అభినయం ఉన్నప్పటికీ ఈ అమ్మడు పెద్దగా రాణించలేకపోయింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ భాషలో కూడా మూవీస్ చేసింది. సినీ కెరీర్ సజావుగా సాగని క్రమంలో ఈ అమ్మడు ప్రేమించిన వ్యక్తిని 2018లో పెళ్లి చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అలానే యూట్యూబ్లో పలు ఇంట్రెస్టింగ్ వీడియోలు చేస్తూ సందడి చేస్తుంది. చాలా రోజులుగా సైలెంట్ అయినా ఈ భామ ఇటీవల తనను అల్లు అర్జున్ బ్లాక్ చేశాడంటూ వార్తల్లోకెక్కింది.
ఇక తాజాగా సినీ పరిశ్రమలో ఉన్న ప్రధాన సమస్య ఒకటి ఉందని, దానికి ముగింపు పలకాలంటూ ట్వీట్ల వర్షం కురిపించింది. సినిమా పరిశ్రమలో ఉన్న అతి ప్రధాన సమస్య వయసు మాత్రమే. వయసు వచ్చినా స్త్రీలను.. పెళ్లైన మహిళలను కేవలం తల్లి, సోదరి, వదినా పాత్రలకే ఎందుకు పరిమితం చేస్తారు. పురుషులకు వచ్చేసరికి మాత్రం అవేమి పట్టింపులు ఉండవు. తమకంటే చిన్నవారికి ప్రేమికుడిగా కనిపిస్తారు. స్త్రీ విలువను వయసు లేదా ఆమె వైవాహిక స్థితి ఆధారంగా చేసుకుని ఎలా నిర్ణయిస్తారు ?. పాత పద్దతులకి ఇప్పటికైన స్వస్తి పలకండి. అన్ని వయసుల మహిళలను పరిశ్రమ పోత్సహించాల్సిన సమయం ఇది అంటూ తెలియజేసింది భానుశ్రీ.
2010లో వరుడు మూవీతో భానుశ్రీ హీరోయిన్ అయ్యారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన వరుడు డిజాస్టర్ కాగా, ఆ దెబ్బతో భానుశ్రీని పట్టించుకున్న నాథుడు లేడు. నిజానికి ఈ హీరోయిన్ మీద విపరీతమైన చర్చ జరిగింది. విడుదల వరకు పోస్టర్స్ లో భానుశ్రీని ఎక్కడ రివీల్ చేయలేదు. ఆది సినిమాకు మంచి ప్రచారం దక్కించింది. సినిమా మాత్రం తేడా కొట్టింది. అడపాదడపా సినిమాలు చేస్తూ ఆమె కెరీర్ నెట్టుకొస్తున్నారు. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశాడంటూ ఈ అమ్మడు వార్తలలోకి ఎక్కింది.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…