Bengaluru Padma : ప‌వన్ సినిమా చేశాక నా కూతురు అందుకే సినిమాలు వ‌ద్ద‌నుకుంది.. బెంగ‌ళూరు ప‌ద్మ‌

Bengaluru Padma : సీరియ‌ల్స్‌లోను, సినిమాల‌లోను క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించి ఎంత‌గానో అల‌రించారు బెంగ‌ళూరు ప‌ద్మ‌.ఈ మ‌ధ్య కాలంలో ఆమె సినీ ప‌రిశ్ర‌మ‌కి కాస్త దూరంగా ఉన్నారు. అయితే అప్పుడ‌ప్పుడు ప‌లు సీరియ‌ల్స్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నారు. అయితే ప‌ద్మ కూతురు గాయ‌త్రి కూడా న‌టి కాగా, ఆమె హ్యాపీ డేస్ సినిమాలో అప్పుగా క‌నిపించి ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకుంది. హ్య‌పీడేస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంలో అప్పు పాత్ర కూడా కీలకమనే సంగతి తెలిసిందే.అయితే తర్వాత రోజుల్లో గాయత్రీ రావు కొన్ని సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్నట్లు నటించింది. అయితే తాజాగా అప్పు తల్లి బెంగుళూరు పద్మ ఓ ఇంటర్వ్యూలో అప్పుకు సినిమా కెరీర్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. హ్యాపీడేస్ ఆ సినిమా కోసం బాయ్ కట్ చేయించుకోవాలని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పడంతో.. కాస్త ఇబ్బంది పడిందని…బాయ్ కట్ చేయించుకున్నాక కూడా చాలా బాధపడి ఏడ్చిందన్నారు. ఆ తర్వాత హ్యాపిడేస్ సినిమాలో అప్పు క్యారెక్టర్ చూసి అంతా బావుందని మెచ్చుకున్నారని పద్మ అన్నారు. తన కూతురు ఇప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉందన్నారు.

Bengaluru Padma told why her daughter left movies
Bengaluru Padma

అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లో నటించిన తర్వాతే .. గాయత్రి ఇక సినిమాలు చేయకూడాదని నిర్ణయం తీసుకుందన్నారు. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో ముందుగా గాయత్రి క్యారెక్టర్ ట్రయాంగిల్ లవ్ అని చెప్పి తీసుకున్నారన్నారు. ఆ తర్వాత సినిమాలో విడుదలయ్యాక.. వేరేలా డిఫరెంట్ టాక్ వచ్చిందన్నారు. సినిమా చేశాక తాను ఇక సినిమాలు చేయనని చెప్పిందన్నారు. సినిమాలు మానేసి చదువుకుందన్నారు. పీజీ పూర్తి చేసిందన్నారు. ఏదీ ఏమైనా వారి వల్లే ఇవాళ నా కూతురు మంచి నిర్ణయం తీసుకొని లైఫ్‌లో స్థిరపడిందన్నారు. హ్యాపీడేస్ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘ఆరంజ్’పవన్ కల్యాణ్‌ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోనూ నటించిన గాయత్రిరావు.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో 2019లో వివాహం చేసుకొని చెన్నైలో సెటల్ అయిపోయింది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago