Bandla Ganesh : ఒకప్పుడు కమెడియన్గా అలరించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారడం, రాజకీయాలలోకి వెళ్లి తిరిగి రావడం ఇటీవల పలువురిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్గా మారడం వంటివి చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ నటించిన చోర్ బజార్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పూరీ భార్య లావణ్యను పొగుడుతూ ర్యాంపులు, వ్యాంపులు వస్తారు పోతారు అని, అలాగే ఆకాష్ ను మెచ్చుకుంటూ.. కన్న కొడుకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుని ఏం చేస్తున్నావ్ అన్నా అంటూ దారుణంగా మాట్లాడాడు బండ్ల.
ఇక తాజాగా ఐడ్రీమ్ నాగరాజుకు ఇంటర్వ్యూ ఇవ్వగా.. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో వ్యాపారాలు, వ్యాపకాలు వంద ఉన్నాయి.. వాటిని పక్కన పెట్టి రాజకీయాల్లో ఎందుకు వేలు పెడుతున్నారని అడగ్గా.. తానేక్కడ వేలు పెట్టానని బండ్ల అన్నారు. పోసాని చావు మాములుగా ఉండదంటూ బండ్ల అన్నట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతోంది. అన్న నువ్వు పెట్టే బోనులో పడే ఎలుకలు చాలా ఉంటాయి. కానీ బండ్ల గణేష్ పడడు. కేటీఆర్ గారు అంటే ఆన్సర్ ఇస్తా.. మెగా ఫ్యామిలీ అంటే ఆన్సర్ ఇస్తా.. పోసాని అంటే ఆన్సర్ ఇస్తా.. లింక్లు పెడితే చెప్పను.. అంటూ నాగరాజుతో కొంచెం ఘాటుగానే మాట్లాడాడు.
తన మీద కోపం ఉంటే తనను కొట్టాలని.. తిట్టాలని.. అంతేగానీ మధ్యలో మా అమ్మానాన్న ఏం చేశారని ప్రశ్నించారు బండ్ల. గతంలో బండ్ల గణేష్ను ఉద్దేశించి ఇన్డైరెక్ట్గా పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యల గురించి అడగ్గా.. భార్యను, బిడ్డలను ప్రేమించనోడు మనిషా అన్న అంటూ బండ్ల ఫైర్ అయ్యారు. పూరీకి మంచి, చెడు చెప్పే హక్కు తనకు ఉందని.. అతను తన ఫ్రెండ్ అని అన్నారు. మా ఎన్నికల సమయంలో కోటా శ్రీనివాసరావును నాగబాబు విమర్శించడం పట్ల మీరు ఎలా స్పందిస్తారు అని అడగ్గా.. నన్ను ఇరికించాలని చూడకు అన్న అంటూ బండ్ల సున్నితంగా చెప్పారు. లవ్ వన్సైడ్ ఉంటోందేమో గానీ.. వార్ వన్సైడ్ ఉండదన్నారు. మొత్తానికి ప్రోమో మాత్రం చాలా వాడివేడిగానే ఉంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…