Bandla Ganesh : బండ్ల గణేష్.. కమెడీయన్ కమ్ నిర్మాతగా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ఇటీవలి కాలంలో వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు. ఆ మధ్య పూరీ జగన్నాథ్పై సంచలన కామెంట్స్ చేసిన బండ్ల తాజాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరై, అల్లు బాబీని పక్కనే పెట్టుకుని కొన్ని వ్యాఖ్యలు చేయగా, ఇవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా బండ్ల గణేష్ ట్విట్టర్ లో, సినిమా ఈవెంట్స్ లో చేసే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతుంటాయి.. కొన్ని సార్లు వివాదంగా మారి బండ్ల గణేష్ కి చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. అయినప్పటికీ మనోడి పంథా మారదు.
తాజాగా బండ్ల గణేష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఈ సారి ఏకంగా బండ్ల గణేష్ అల్లు బ్రదర్స్ పై ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీతో కలిసి ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరైన బండ్ల గణేష్.. ముందుగా ఆయనతో కలసి మాటలు కలిపి ఆ తర్వాత ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. అల్లు బాబీని పక్కనే పెట్టుకుని బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అందరికి చెబుతున్నా.. దయచేసి తండ్రి మాట వినొద్దు. తండ్రి మాట వింటూ పెరిగితే మా బాబీ గారిలా అవుతారు. తండ్రి మాట వినకుండా నచ్చింది చేస్తే మా హీరో బన్నీగారిలా అవుతారు. బాబీగారిలా కావాలా, బన్నీగారిలా అవ్వాలా అనేది మీరే నిర్ణయించుకోండి.
అల్లు బాబీ గారు చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని తండ్రి మాట వింటూ పెరిగారు. అందుకే ఇలా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చింది చేసుకుంటూ వెళ్లడంతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కాబట్టి ప్రతి ఒక్కరు సొంత నిర్ణయాలు తీసుకోండి అంటూ బండ్ల గణేష్ కామెంట్ చేయగా, ఈ వ్యాఖ్యలు బాబీని కించపరిచే విధంగా ఉన్నాయి. బండ్ల గణేష్ కామెంట్స్ ని బాబీ సరదాగా తీసుకుని నవ్వేసిన.. నెటిజన్లు మాత్రం బండ్ల గణేష్ పై విరుచుకుపడుతున్నారు. అన్నదమ్ముల మధ్య ఎందుకు పుల్లలు పెడతావు అంటూ ఫైర్ అవుతున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…