Balakrishna : చంద్రబాబు అరెస్ట్ తర్వాత నందమూరి బాలకృష్ణ రాజకీయాలలో బిజీ అయ్యారు. ఆయన పలు ప్రెస్ మీట్స్లో ఆసక్తికర విషయాలు మాట్లాడుతూ రాజకీయం మరింత రంజుగా మారేలా చూస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టైన తర్వాత చంద్రబాబు అరెస్టుపై టీడీపీతోపాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. అయితే, దివంగత ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ కుమారుడు, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వ్యవహారంపై స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలయ్య మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని కొందరు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం మొదలు పెట్టారని బాలకృష్ణ అన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని.. ఈ ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు హయాంలో చేసిన తెలంగాణ అభివృద్ధి కలిసి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారన్నారు బాలకృష్ణ. అయితే, తెలంగాణలో మాత్రం కొందరు మూడు రోజుల నుంచి ఖండిస్తున్నారన్నారు. కేవలం ఓట్ల కోసమే ఇక్కడ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని విమర్శించారు బాలకృష్ణ. కేసులకు అరెస్టులకు భయపడమని.. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు బాలకృష్ణ. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు స్పందించిన స్పందించకపోయిన నాకు అవసరం లేదు, జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయిన ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని అనడం సరికాదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పూర్తిస్థాయిలోపోరాడాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇప్పుడు టైం వచ్చిందని.. తప్పకుండా టీడీపీ జెండా తెలంగాణలో రెపరెపలాడుతుందన్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబును ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అక్రమ కేసుల్లో ఇరికించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ను అందరూ ఖండిస్తున్నారు. అందరిలో ఆలోచన మొదలైంది అని అన్నారు బాలయ్య.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…