Balakrishna : బాహుబలి సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపించేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈసినిమా ప్రేరణతోనే ఇప్పుడు చాలా సినిమాలు కూడా భారీ బడ్జెట్తో షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే అప్పట్లోనే బాహుబలి లాంటి సినిమాని ఎన్టీఆర్, బాలకృష్ణ చేశారట. కాని పలు కారణాల వలన ఆ సినిమా ఆగిపోయిందట. సాధారణంగా కొన్ని సినిమాలు మొదలైనప్పటి నుంచే బాల అరిష్టాలు ఎదుర్కొంటూనే ఉంటాయి.మరికొన్ని సగం షూటింగ్ అయ్యాక ఇబ్బందుల్లో పడుతాయి.
కొన్ని సినిమాలు అయితే షూటింగ్ పూర్తయ్యాయ కూడా విడుదలకు నోచుకోని పరిస్థితి ఉంటుంది.హీరో బాలయ్య నటించాలనుకున్న నర్తనశాల, కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరిమువ్వల సింహనాదం, మెగాస్టార్ చిరంజీవి నటించిన సింహపురం సింహం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న చిత్రాలే .అయితే ఎన్టీఆర్, బాలయ్యతో అనుకొని ఆగిపోయిన సినిమా కంచు కాగడా సినిమాని బాలయ్యతో కలిసి ఓ భారీ జానపద చిత్రంగా చేయాలని అనుకున్నాడు ఉప్పల పాటి విశ్వేశ్వర్ రావు.అందులో భాగంగానే కంచుకోట అనే సినిమాను నిర్మించాడు.ఈ సినిమాకు కథ కూడా ఆయనే రాశాడు.కేఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య కీలక పాత్ర పోషించాడు.
సావిత్రి, దేవిక హీరోయిన్లు.ఈ సినిమాకు ఆరోజుల్లోనే 7 లక్షల రూపాయలు పెట్టాడు. అయితే ఈ సినిమా అప్పట్లో 30 సెంటర్లలో విడుదల అయ్యింది.కేవలం ఏడు రోజుల్లోనే 7 లక్షల రూపాయలను వసూలు చేసింది . ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి కంచు కాగడా సినిమా చేయాలనుకున్నాడు నిర్మాత విశ్వేశ్వర్ రావు.ఇది కూడా జానపద చిత్రంగానే తెరకెక్కించాలి భావించింది.జమున హీరోయిన్ గా చేసింది.అంతేకాదు ఎన్టీఆర్, బాలయ్య పై పలు సీన్లు కూడా చిత్రీకరించాడు.అయితే ఆ తర్వాత జమున గర్భవతి అయ్యింది.అయితే ఆమె ప్రసవించాక సినిమా చేయాలి అనుకున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ హీరో చనిపోవడంతో ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమా అలాగే మిగిలిపోయింది.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…