Balagam Soudhamini : ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా బలగం మూవీ గురించే చర్చ నడుస్తుంది. ఈ సినిమా అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించగా.. మిగతా నటీనటులు అడియన్స్ కు అంతగా మనకు తెలియనివారే. కానీ ఈ సినిమాతో ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఈ మూవీలో కనిపించింది తక్కువ సమయమే అయినా.. తన నటనతో నవ్వించింది. ఎక్కువగా డైలాగ్స్ లేకుండానే జనాలని ఉట్టిగా ఆకర్షించింది సౌదామిని. ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా కనిపించింది సౌదామిని.
కొమురయ్య చనిపోయినప్పుడు కాబోయే భర్త ఇంటికి రావడం.. అక్కడ ప్రియదర్శి.. సౌదామిని మధ్య ఎలాంటి డైలాగ్స్ లేకుండానే.. కేవలం ఎక్స్ప్రెషన్స్తో వారిద్దరు ప్రేక్షకులు తెగ నవ్వు తెప్పించారు. వారిద్దరి మధ్య ఒక్క డైలాగ్ లేకపోయినా.. తన ఎక్స్ప్రెషన్స్తోనే ఫేమస్ అయ్యింది. ఆర్టిస్ట్ కావాలనే కోరికతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సౌదామిని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సినిమా కోసం తాను ఏకంగా పది కేజీల బరువు పెరిగినట్లు చెప్పుకొచ్చింది. ‘ఆడిషన్ కోసం డైరెక్టర్ వేణు ఆఫీస్ కి వెళ్ళాను. ఆయన నన్ను సిగ్గుపడి చూపించమనగా, నేను నా పెర్ఫార్మన్స్ చేసి చూపించగా ఓకే చేశారు.
నాకు చిన్నప్పటి నుండి నటి కావాలనే ఆశ ఎంతో ఉండేది.ఉంది. ఈ పాత్ర కోసం పది కేజీల బరువు పెరగమంటే… కేకులు తిని లావయ్యాను. హీరో ప్రియదర్శి మంచి సపోర్ట్ ఇచ్చారు. వేణు కారణంగానే నాకు గుర్తింపు వచ్చింది.సినిమా ఆఫర్స్ కోసం ఒంటరిగా ఎక్కడికెళ్లాలన్నా భయం ఉండేది. అందుకే అన్నయ్యను తోడు తీసుకుపోయేదాన్ని. బలగం చిత్రం చూశాక జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కాల్ చేశారు. ఆయన మూవీలో నాకు ఛాన్స్ ఇస్తానన్నారు. ఒకప్పుడు నీ ముఖానికి హీరోయిన్ అవుతావా? అని ఎగతాళి చేశారు అంటూ సౌదామిని చెప్పుకొచ్చింది. బలగం విషయానికి వస్తే.. ఎన్నో కుటుంబాలను ఈ సినిమా మళ్లీ కలిపిందని చెప్పవచ్చు.కొన్ని ఏళ్ల నుంచి పగలు ప్రతీకారాలతో కోపంతో రగిలిపోతున్న ఫ్యామిలీలు కూడా ఈ సినిమాను చూసిన తర్వాత ఒక్కటయ్యాయి.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…