Babar Azam : క్రికెట్ ఫ్యాన్స్ అంటే అంతే. గెలిచినప్పుడు తమ దేశ ప్లేయర్లు కింగులని.. వాళ్లంతటి వారు లేరని పొగుడుతారు. కానీ ఓడినప్పుడు మాత్రం దాన్ని క్రీడగా చూడరు. దారుణంగా ట్రోల్ చేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్లేయర్లు ఏ మ్యాచ్లోనైనా విఫలం అయితే వారిపై ట్రోలింగ్ ఎక్కువవుతోంది. కేవలం క్రీడలు మాత్రమే కాదు.. ఇతర రంగానికి చెందిన సెలబ్రిటీలు కూడా ప్రస్తుతం ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ ఒకెత్తయితే నేరుగా జరిగే అవమానాలు మరొక ఎత్తు. సెలబ్రిటీ కనిపిస్తే చాలు.. పెద్దగా అరుస్తూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా పాక్ క్రికెటర్, కెప్టెన్ బాబర్ అజమ్కు గ్రౌండ్లోనే చేదు అనుభవం ఎదురైంది.
ప్రస్తుతం పాక్ తన సొంత దేశంలో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అందులో భాగంగానే తాజాగా రెండో టెస్టు కూడా పూర్తయింది. మొదటి టెస్టులో ఘోర ఓటమి పాలైన పాక్కు రెండో టెస్టులో గెలిచే అవకాశం వచ్చింది. వికెట్లను కాపాడుకుని ఉంటే టార్గెట్ను సులభంగా ఛేదించేవారే. కానీ వికెట్లను కోల్పోవడంతో కేవలం 26 పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోయింది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-0తో ఇప్పటికే సిరీస్ను చేజిక్కించుకుంది. అయితే రెండో టెస్టులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తొలి ఇన్నింగ్స్లో 75 పరుగులు చేసి ఫర్వాలేదనిపించినా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం 1 పరుగు మాత్రమే చేశాడు. దీంతో అతను ఔట్ అయి పెవిలియన్ వైపు వెళ్తున్న సమయంలో స్టేడియంలో పక్కనే స్టాండ్స్లో ఉన్న కొందరు ప్రేక్షకులు తమ అసహనాన్ని వెళ్లగక్కారు. బాబర్ ఆజంను ట్రోల్ చేశారు.
బాబర్ ఆజం స్టాండ్స్ నుంచి వెళ్తుండగా.. జింబాబర్.. జింబాబర్.. అని నినాదాలు చేశారు. అవన్నీ ఆ సమయంలో తీసిన వీడియోలో స్పష్టంగా వినిపించాయి. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇక పాక్ తన మూడో టెస్ట్ను డిసెంబర్ 17వ తేదీ నుంచి ఆడనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కరాచీలో జరుగుతుంది. చాలా ఏళ్ల తరువాత సొంత దేశంలో మ్యాచ్లను ఆడుతున్నప్పటికీ పాక్ మాత్రం పరాజయాల బాటలోనే నడుస్తుండడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మూడో టెస్టులో అయినా గెలిచి పరువును కాపాడుకుంటుందో లేదో చూడాలి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…