Asalu Movie : ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందించడంలో డైరెక్టర్ కమ్ నటుడు రవిబాబు ముందుంటారు. ముఖ్యంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో ఆయన శైలివేరు అని చెప్పాలి.. దివంగత నటుడు చలపతిరావు తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన.. అల్లరి సినిమాతో దర్శకుడిగా పరిచయం కాగా, ఆ తర్వాత అనసూయ, అమరావతి, అవును వంటి సినిమాలను రూపొందించారు. ఈ చిత్రాలు హిట్స్ కావడంతో.. మరోసారి అలాంటి క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చాలా కాలం గ్యాప్ తర్వాత రవిబాబు తెరకెక్కించిన చిత్రం ‘అసలు’.
పూర్ణ, రవిబాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా అటు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఏప్రిల్ 13 నుంచి ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా గత అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇటీవల ట్రైలర్ విడుదల కాగా, దానికి మంచి స్పందన వచ్చింది.. ట్రైలర్ చూస్తుంటే థ్రిల్లర్ అంశాలు ఎక్కువగానే ఉన్నట్లు కనిపించింది.
ఓ దారుణమైన హత్యను చేధించే పనిలో ఉంటాడు ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తారు. ఈ హత్య వెనుక ఓ రహస్యాలు ఏమిటి ఆ నలుగురు అనుమానితులకు హత్యకు సంబంధం ఏంటి అనే అంశాలను సినిమాలో చూడొచ్చు. తాజాగా ఈటీవీ విన్ ‘అసలు’ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ ను చేస్తూ.. సినిమా చూసేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ హెచ్చరించింది. ఇక రవిబాబు మొదటనుంచీ తీస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు అన్నీ ‘అ’ అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి. ‘అల్లరి’, ‘అనసూయ’, ‘అమరావతి’, ‘అవును 1,2’ ఇలా.. ఇప్పుడు ఈ సినిమాకి కూడా మొదటి అక్షరం అ వచ్చేలా ‘అసలు’ అని పేరు పెట్టారు. మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందనేది చూడాలి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…