Anita Hassanandani : ఉదయ్ కిరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన నువ్వు నేను సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక మంది సినీ తరాలు ఇలా వచ్చి ఆలా వెళ్లిపోతూ ఉంటారు. తెలుగు సినీ ప్రపంచంలో ఇలా వచ్చి వెళ్లే వాళ్లు ఎక్కువే. కెరీర్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు… సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీ విడి వెళ్ళిపోయిన వాళ్లు ఉన్నారు. 1999లో టాలీవుడ్, బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనిత… 2001లో ఉదయ్ కిరణ్ తో నటించిన నువ్వు నేను సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నారు. అప్పట్లో బిగ్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో అనిత నటనకు మంచి మార్కులు ఇచ్చారు ప్రేక్షకులు. నువ్వు నేను సినిమా అనంతరం అనేక తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో అనిత నటించారు.
తరువాత కొన్ని ఐటెం సాంగులతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అటు తరువాత అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చారు.2011లో నుంచి పూర్తిగా సినిమాలకు దూరం అయ్యి వచ్చిన క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైంది అనిత. చివరగా తెలుగులో 2016లో మనలో ఒకడు సినిమాలో నటించింది అనిత. ఇప్పుడు మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత సుహాస్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే నువ్వు నేను సినిమా రీ రిలీజ్ చేయడం గమనార్హం. నువ్వు నేను సినిమాతో తెలుగులో మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అనిత ఆ తర్వాత శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను, రగడ.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది.
ఇదిలా ఉంటే సుహాస్ 8వ సినిమా రీసెంట్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ్ సూపర్ హిట్ సినిమా జోయ్ హీరోయిన్ మాళవిక మనోజ్ నటిస్తుంది. ఈ సినిమా కొత్త దర్శకుడు రామ్ గోడల దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాతో ‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత హాసనందిని తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో అనిత ప్రెస్ మీట్లో కూడా పాల్గొంది. చాలా క్యూట్క్యూట్గా కనిపిస్తూనే తన మాటలతో ఎంతగానో అలరించింది. ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తప్పక చేస్తానని కూడా చెప్పింది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…