బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన వారిలో శివజ్యోతి కూడా ఒకరు. అంతకు ముందు ఇస్మార్ట్ వార్తలతో సావిత్రి అంటూ తెలంగాణ ప్రజలను పలకరిస్తుండేది. బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా ఆమె ఇమేజ్ మారిపోయిందనే చెప్పాలి. ఒకప్పుడు న్యూస్ రీడర్ గా పనిచేసిన శివ జ్యోతి ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అదే విధంగా ఈమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తనకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరితో షేర్ చేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో భర్తతో కలిసి ఉంటున్న శివజ్యోతి.. సొంతంగా ఇల్లు కట్టుకుంది. కాస్ట్ లీకారు కూడా కొనుక్కుంది.
ఇప్పుడు తన అత్తింటి వారికి కూడా కొత్త ఇల్లు కట్టిస్తున్నట్టు సమాచారం. అయితే ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చులు పెట్టి ఇల్లు నిర్మిస్తే ఆ ఇంటీరియర్ మొత్తం ఫెయిల్ అయింది అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది.అంతేకాకుండా సదరు డిజైనర్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సీలింగ్ సరిగా లేదని కూలిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపింది.అంతేకాకుండా తలుపులకు బాత్రూంలో స్టిక్కర్లు అతికించేశారు అని ఆమె తెలిపింది. వీడియోలో అవన్నీ చూపిస్తూ ఇవన్నీ మళ్లీ వాళ్లతోనే ముక్కు పిండి అయినా సరే రిపేర్ చేయిస్తాను అని తెలిపింది శివ జ్యోతి.
తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడుతూ యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది శివ జ్యోతి. టివి కార్యక్రమాల్లో సావిత్రక్కగా పాపులర్ అయింది. శివ జ్యోతి యాంకరింగ్ చేస్తూ హాస్యం పండించడంలో, కామెడీ పంచ్ లు పేల్చడంలో దిట్ట. దీనితో శివ జ్యోతికి తెలుగు వారిలో విశేషమైన గుర్తింపు లభించింది. ఇటీవల శివ జ్యోతి గర్భవతి అంటూ ఫేక్ న్యూస్ వైరల్ గా మారింది. దీనితో తన ప్రెగ్నన్సీ పుకార్లకు చెక్ పెడుతూ శివ జ్యోతి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలోను శివ జ్యోతి చాలా యాక్టివ్గా ఉంటుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…