Anam Venkata Ramana Reddy : ప్రస్తుతం ఏపీలో రాజకీయం ఏ రేంజ్లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఓ వైపు పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులకి చెమటలు పట్టిస్తుంటే మరోవైపు తేదేపా కార్యకర్తలు అనేక విషయాలపై టీడీపీ నాయకులకి చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన బాబాయి రూప్ కుమార్ యాదవ్తో ఉన్న విభేదాలు తేల్చుకొని.. తమ యువనేత లోకేశ్పై విమర్శలు చేయాలని తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి హితవు పలికారు. గూడూరు నియోజకవర్గం తాడిమేడు యువగళం పాదయాత్ర బస ప్రాంతంలో ఆనం మీడియా సమావేశం నిర్వహించారు. మా నాయకుడు లోకేశ్ అమెరికాలో చదివాడని గర్వంగా చెప్పుకుంటామని.. మీ నాయకుడు ఏం చదివాడో, ఎక్కడ చదివాడో చెప్పగలవా అని ప్రశ్నించారు.
మాదకద్రవ్యాల సొమ్ము పంపకాల్లో తేడాలొచ్చి నిరాశ, నిస్పృహకు లోనైన అనిల్ కుమార్.. టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.. ఎప్పుడూ వరదలు రాని సర్వేపల్లి కాలువకు రక్షణ గోడలు కట్టించి, ప్రజల సొమ్ము కొట్టేసిన పెద్ద అవినీతిపరుడు అనిల్ కుమార్ అని ఆరోపించారు. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో అనిల్ కుమార్, రూప్ కుమార్ వాటాలతోపాటు, కొంతవాటా తాడేపల్లి ప్యాలెస్కు చేరిందని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నెల్లూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న డ్రగ్స్ మూలాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించి తెర వెనకున్న పెద్ద తలకాయల్ని తక్షణమే అరెస్ట్ చేయించి జైలుకు పంపాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.
లోకేష్ ని అరేయ్, ఒరేయ్ అంటూ విమర్శించిన మాజీ మంత్రి అనిల్ని చెడగుడు ఆడేసుకున్నాడు. మొరిగేవాటన్నిటికీ తాను సమాధానం చెప్పనంటూనే దమ్ముంటే రాజీనామా చెయ్ తేల్చుకుందామని అనిల్ కి సవాల్ విసిరారు ఆనం.ఒరేయ్ లోకేష్ అని నువ్వు అన్నావ్.. ఒరేయ్ జగన్గా అని మేం అని అనొచ్చా.. కాస్త బుర్ర వాడు. లోకేష్ పప్పు అన్నావ్..అతను స్టాన్ ఫార్డ్లో చదివాడు. ప్రపంచంలో పెద్ద యూనివర్సిటీలో చదివాడు. మీ జగన్ పదో తరగతి చదివాడు. అది కూడా ఫెయిల్.. పాస్ అయ్యాడో అనుకుందాం..నీ పార్టీ వాళ్లు నిన్ను బంగారు బూతులు తిడుతున్నారు బంగారు కొండ. రెడ్ నోటీస్ వచ్చిన కూడా రూప్ కుమార్ యాదవ్ ని భయపెడుతున్నట్టు అర్ధమవుతుంది. మా ప్రభుత్వం వస్తే మేమెంటే మీకు నిరూపిస్తాం అని సవాల్ విసిరారు ఆనం.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…