Ambati Rambabu : మార్చిలో ఏపీ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో టీడీపీ,వైసీపీ, జనసేన ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇదే క్రమంలో ఒకరిపై ఒకరు దారణమైన విమర్శలు చేసుకుంటూ వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్పై దారుణమైన కామెంట్స్ చేశారు. టీడీపీ ఈ రకంగా నాశనం అవ్వటానికి లోకేశ్ కారణమని మంత్రి అంబటి పేర్కొన్నారు. పవన్కు ఏ బలం ఉందని టీడీపీకి మద్దతు ఇస్తాడని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు కక్షసాధింపు ఏంటిని ప్రశ్నించారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పారు.
ఆలోచన లేకుండా లోకేశ్ మాట్లాడిన కారణంగానే ఈ పరిస్థితులు వచ్చాయని అంబటి చెప్పుకొచ్చారు. చంద్రబాబు సైతం వైఎస్సార్ తనను ఏం చేయలేకపోయారంటూ జగన్ గురించి మాట్లాడారని గుర్తు చేసారు. పార్టీ నిర్ణయించిన విధంగా ఈ నెల 26 నుంచి వైయస్ఆర్సీపీ బస్సు యాత్రలు ప్రారంభమవుతాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అవినీతిలో కూరుకుపోయిన తెలుగు దేశం పార్టీని కాపాడటం ఎవరి వల్ల కాదని పేర్కొన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని టీడీపీ నేతలు చెప్పటం లేదన్నారు. 17ఏ చూపించి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పైన కక్ష్య సాధించాలంటే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జరిగేదని..ఇప్పుడు పూర్తి ఆధారాలతో అరెస్ట్ జరిగిందని మంత్రి అంబటి చెప్పుకొచ్చారు.
చంద్రబాబు అరెస్టైతే చాలా మంది చనిపోయారని టీడీపీ అనుకూల పత్రికల్లో రాస్తుంటే… లోకేష్ మాత్రం ఢిల్లీలో ఉంటున్నారని అంబటి చెప్పుకొచ్చారు. నిజంగా చంద్రబాబు అరెస్ట్ వార్త విని అంతమంది చనిపోతే వారి కుటుంబాలను లోకేష్ పరామర్శించకుండా ఢిల్లీ పోయి ఏం చేస్తున్నాడు. టీడీపీకి ఇంకా ఏమైనా ప్రాణం ఉంటే అది కూడా పోగొట్టే పనిలో లోకేష్ ఉన్నాడనే విషయం ఆ పార్టీ శ్రేణులు గుర్తించాలని అంబటి సూచించారు. టీడీపీకి తన మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్, వారాహి యాత్రలో మాత్రం టీడీపీ పని అయిపోయింది అని అంటున్నారని గుర్తు చేశారు. టీడీపీకి ఇంకా 23 సీట్లయినా వచ్చాయని..పవన్ కు ఒక సీటే వచ్చిందని చెప్పుకొచ్చారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…