అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఇటీవలి కాలంలో చేస్తున్న రచ్చ మాములుగా లేదు. సోషల్ మీడియా వేదికగా స్నేహ రెడ్డి ప్రకంపనలు పుట్టిస్తుంది. బన్నీ ఎంతో ఫేమస్సో .. ఆయన వైఫ్ స్నేహ కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంది. స్నేహా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ సంగతులను అభిమానుల ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. అలానే ఫ్యామిలీ టూర్స్కి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. కొంత కాలంగా స్నేహా రెడ్డి తన ఫ్యాషన్ పోటో షూట్స్ కు సంబంధించిన అదిరిపోయే ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.
స్నేహా రెడ్డి ఫొటో షూట్స్ సినీ ప్రియులు థ్రిల్ అవుతున్నారు. హీరోయిన్స్ సైతం కుళ్లుకునేలా స్నేహా రెడ్డి రచ్చ చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ గా పోజులిస్తూ ఆమె చేస్తున్న ఫోటో షూట్స్ కు ఔరా అంటున్నారు బన్నీ ఫ్యాన్స్ . ఇద్దరు పిల్లలను కన్న తరువాత కూడా ఏమాత్రం ఫిట్ నెస్ కోల్పోకుండా స్నేహా రెడ్డి ఇంత గ్లామర్ మెయింటైన్ చేయడం గ్రేట్ అని కొందరు అంటున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమా షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా తన భార్యని, పిల్లలని వెకేషన్ కి తీసుకెళుతుంటారు. వాటికి సబంధించి ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ని అలరిస్తూ ఉంటుంది స్నేహా రెడ్డి.
బన్నీకి తగ్గట్లు భార్య స్నేహా కూడా ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది. డ్రెస్సింగ్ కూడా ఆ విధంగానే ప్లాన్ చేస్తుంటుంది. అల్లు అర్జున్ కు అతని భార్య స్నేహ కూడా ఏమాత్రం తీసిపోదు అని ఆమెని చూసిన వారు ఎవరైన అనాల్సిందే.ఈ దంపతులను స్టైలిష్ కపుల్ అని కూడా ప్రేక్షకులు సంభోదిస్తూ ఉంటారు. ఇక అల్లు అర్జున్ ఓ వైపు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న తన కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాడు. టైం దొరికితే ఫ్యామిలీని తీసుకొని.. విదేశాలకు విహార యాత్రలకు వెళ్తూ ఉంటాడు. త్వరలో పుష్ప 2 షూటింగ్లో పాల్గొననున్నాడు బన్నీ.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…