Pakistan Cricket Team : మరి కొద్ది రోజులలో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ మొదలు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు సుదీర్ఘ కాలం తర్వాత భారత్లో అడుగుపెట్టింది. వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు వచ్చిన ఆ జట్టు సభ్యులకు హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. బుధవారం (సెప్టెంబర్ 27) రాత్రి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు పాకిస్థాన్ టీమ్ చేరుకుంది. అక్కడ నుంచి ప్రత్యేక బస్సులో వారు బస చేయనున్న హోటల్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ప్రయాణికులు చేతులు ఊపుతూ పాకిస్థాన్ జట్టు సభ్యులకు స్వాగతం పలికారు. సెల్ ఫోన్లలో దృశ్యాలను బంధించేందుకు పోటీపడ్డారు.
పాకిస్థాన్ టీమ్కు స్వాగతం పలికేందుకు కొంత మంది స్థానికులు ఎయిర్పోర్టు చేరుకొని వారికి ఘన స్వాగతం పలికారు.. బస్సు వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు. బాబర్ ఆజం బాయ్ అంటూ పలువురు పెద్దగా కేకలు వేశారు. తమ టీమ్ బస్సు డ్రైవర్కు ప్రేమ పూర్వకంగా విష్ చేస్తూ బస్సులో ఎక్కి కూర్చున్నారు.ఇక శంషాబాద్ విమానాశ్రయం నుంచి పార్క్ హయత్కు చేరుకున్న పాక్ జట్టుకు హోటల్లోనూ ఘన స్వాగతం లభించింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్కు రావడం ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక భారత్ – పాక్ తలపడే మ్యాచ్కు ఉత్కంఠ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు! భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నా..క్రీడాసంబంధాలు మాత్రం అంటీముట్టనట్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. క్రికెట్ సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
ప్రపంచ టాప్ ర్యాంక్ బ్యాటర్ బాబర్ అజమ్ నాయకత్వంలోని పాకిస్థాన్ జట్టు 7 సంవత్సరాల విరామం తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టింది. లాహోర్ నుంచి దుబాయ్ మీదుగా మన హైదరాబాద్ నగరానికి చేరుకొంది.హైదరాబాద్లో అడుగుపెట్టిన పాక్ జట్టు తన మొదటి వార్మప్ మ్యాచ్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 7 ఏళ్ల తర్వాత భారత్కు వచ్చిన పాకిస్థాన్ జట్టుకు శుభారంభం చేసే అవకాశం రాలేదు. బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు తమ తొలి ప్రాక్టీస్ మ్యాచ్లో న్యూజిలాండ్తో 5 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…
ఏపీలో వరదలు సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొందరు ఇప్పటికీ దిక్కుతోచని స్థితిలో…
YS Jagan : ఈ ఎన్నికలలో ఘోరంగా ఓడిన జగన్ ప్రతి సందర్భంలో ప్రభుత్వంపై ఏదో ఒక విధంగా విమర్శలు…
Harish Rao : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఇష్టమొచ్చినట్టు…
గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం వలన చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…
YS Sharmila : వైఎస్ షర్మిళ ఇటు తెలంగాణ, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…