Harish Rao : కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం పోయింది: హ‌రీష్ రావు

Harish Rao : తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, ఇష్ట‌మొచ్చిన‌ట్టు తిట్టుకోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. మొన్నటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఇప్పుడు వారిపై అనార్హత వేటు అంశం సర్వత్రా ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు.. కీలక తీర్పునిచ్చింది. సదరు ఎమ్మెల్యేలపై.. నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఈ విష‌యం తెలంగాణ అంత‌టా హాట్ టాపిక్ అయింది. ఇక ఇదే సమ‌యంలో హ‌రీష్ రావు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుతో రాష్ట్రమంతటా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సర్వనాశనమైందని, హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని రేవంత్‌రెడ్డి దెబ్బతీశారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మండలాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోయాయని, గతంలో రోజుకు 30 రిజిస్టేషన్లు అయితే ఇప్పుడు నెలకు 30 కూడా కావడం లేదని చెప్పారు.కేంద్రం ఇచ్చిన రూ.800 కోట్ల ఉపాధి హామీ నిధులను కాంగ్రెస్‌ ప్రభుత్వం దారి మళ్లించిందని తెలిపారు. రేషన్‌కార్డ్‌ నిబంధనలు పెట్టడం వల్లే రైతు సురేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని హరీశ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 50 శాతానికి మించి రుణమాఫీ కాలేదని చెప్పారు.

because of congress government real estate is down says Harish Rao
Harish Rao

కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు రెండు సార్లు రుణమాఫీ చేసిందని, ప్రతి పంట సాగుకు ముందే రైతుబంధు అందించి రైతులకు దన్నుగా నిలిచిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పాలనలో 10 నెలల నుంచి గ్రామ పంచాయతీలకు నిధుల్లేవని హరీశ్‌రావు చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చిపెడుతున్నారని, ఒక్క పైసా కూడా పంచాయతీలకు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏ ప్రభుత్వ దావాఖానకు వెళ్లినా మందుల కొరత ఉన్నదని చెప్పారు. కుక్కల దాడులు పెరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించి సాయం చేసేందుకు వెళ్లిన తమపై కాంగ్రెస్‌ నాయకులు దాడి చేయడం అప్రజాస్వామ్యమని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

10 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

16 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

3 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

3 days ago