ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్లో కొన్ని జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఏ జట్లు సెమీస్కి చేరతాయి, ఏ జట్లు ఇంటికి వెళతాయి అనే దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్కప్లో ఇండియాను ఎలాగైనా సెమీఫైనల్కు చేర్చాలని ఐసీసీ చూస్తోందంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అనడం సంచలనం రేపుతోంది. ఈ మ్యాచ్లో అంత భారీ వర్షం పడినా మ్యాచ్ను త్వరగా ప్రారంభించడం, విరాట్ కోహ్లి ఓ నోబాల్ విషయంలో అంపైర్లపై ఒత్తిడి తీసుకు రావడం, ఆ తర్వాత కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ వీడియో బయటకు రావడంలాంటివి ఈ మ్యాచ్ను వివాదంలోకి నెట్టేశాయి.
బంగ్లాతో మ్యాచ్ ముగిశాక సామా టీవీతో అఫ్రిది ఓ డిస్కషన్లో పాల్గొన్నాడు. నిజానికి ఆ చర్చంతా దీని చుట్టే తిరిగింది. ఆ టీవీ యాంకర్ పదే పదే ఇండియాను ఫైనల్ చేర్చడానికి ఐసీసీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించాడు. ఈ చర్చలో పాల్గొన్న మరో జర్నలిస్ట్ కూడా ఐసీసీ.. ఇండియా వైపు మొగ్గినట్లు కనిపిస్తోందని అనడం విశేషం. కాగా, “షకీబుల్ హసన్ కూడా ఇదే విషయం చెప్పాడు. దానిని స్క్రీన్పై కూడా చూపించారు. గ్రౌండ్ కూడా చాలా తడిగా ఉంది. కానీ ఐసీసీ కూడా కాస్త ఇండియా వైపు మొగ్గినట్లు నాకు అనిపిస్తోంది. ఇండియాను ఎట్టి పరిస్థితుల్లోనూ సెమీస్ చేర్చాలని చూస్తున్నట్లుగా ఉంది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్లో అంపైర్లు కూడా ఇలాగే వ్యవహరించారు. వాళ్లకు బెస్ట్ అంపైర్ అవార్డులు వస్తాయని ప్రపంచానికి కూడా తెలుసు” అని సదరు జర్నలిస్ట్ అన్నాడు.
దీనిపై స్పందించిన ఆఫ్రిది.. . “ఏం జరిగిందో నాకు తెలుసు. చాలా వర్షం పడిన తర్వాత మ్యాచ్ వెంటనే ప్రారంభమైంది. ఐసీసీ, ఇండియా ఆడుతోంది, ఇందులో చాలా విషయాల జోక్యం ఉంది. అయితే లిటన్ దాస్ బ్యాటింగ్ మాత్రం అద్భుతం. అతడు పాజిటివ్ క్రికెట్ ఆడాడు. ఆరు ఓవర్ల తర్వాత మరో రెండు మూడు ఓవర్లు ఆట ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ లో గెలిచే స్థితికి వచ్చేది. మొత్తానికి ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ చూపిన పోరాటం మెచ్చుకోదగినది..’ అని వ్యాఖ్యానించాడు ఆఫ్రిది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…