Pragathi Fish Curry : నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న ప్రగతి ఎన్నో పాత్రలలో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ లైఫ్ గురించి సినిమాల గురించి అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది. కాగా పెళ్లి చేసుకుని భర్తతో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకున్న ప్రగతి.. అప్పటికే ఒక పాప కి బాబుకి జన్మనిచ్చింది. భర్తతో విడిపోయిన తర్వాత కూతురు, కొడుకు జీవితాన్ని చక్కదిద్దడానికి తాను ఎంతో కష్టపడింది.
పిల్లలని లైఫ్ లో సెటిల్ చేయడానికి చాలా పాట్లు కూడా పడింది. కాగా ఇలాంటి ఏజ్ లో తనకు తోడు కావాలి అన్నది పిల్లల ఉద్దేశం అని త్వరలో ఆమెకు మరో పెళ్లి చేసేందుకు పిల్లలు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు నానా రచ్చ చేస్తూ ఉండే ప్రగతి ఆంటీ తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో చేపల పులుసు వండుతూ ఘుమఘుమలాడించింది. చాలా సింపుల్గా అందరికీ నచ్చే పద్దతిలో చేపల పులుసు చేసి అందరు లొట్టలేసుకునేలా చేసింది. పచ్చిమామిడికాయ, వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని చేపల పలుసు అద్భుతంగా వండింది.
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు పులుసు, టమాటో, నూనె, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మరికొన్ని వాటిని ఉపయోగించి చేపల పులుసు పెట్టింది.. చేపల పులుసు రుచిగా రావాలంటే.. ఏది ఎప్పుడు పడాలో అప్పుడు పడితేనే ముక్కలకి బాగా మసాలా పట్టి టేస్ట్ వస్తుందని చెప్పుకొచ్చింది. మెంతుల పొడి ఏమాత్రం ఎక్కువ వేసినా కూర చేదు అయిపోయిందని చాలా తక్కువ వేసుకోవాలని చెప్పింది ప్రగతి. పది నిమిషాల కంటే చేప ఉడకాల్సిన పనిలేదని చెప్పింది ప్రగతి. ఎక్కువ ఉడికితే ముక్క విడిపోతుందని చెప్పింది. కూర మొత్తం ఉడికిన తరువాత చివర్లో పచ్చి మిర్చీ యాడ్ చేసి ఇది తన స్పెషాలిటీ అని చెప్పుకొచ్చింది. మరి ప్రగతి ఆంటీ చేసిన చేపల పులుసుపై మీరు ఓ లుక్కేయండి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…