Kodali Nani : చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయం మరింత వేడెక్కుతుంది. రోజురోజుకి ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటూ నానా హంగామా సృష్టిస్తున్నారు. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని అయితే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై తెగ విమర్శలు చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం విజయవాడ జగ్గయ్య పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసేందుకు విజయవాడకు రోడ్డు మార్గంలో బయల్దేరారు. అయితే ఆయనను గరికపాడు చెక్ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అతను మొదట ఎయిర్వేస్ ద్వారా ఆంధ్రాకు చేరుకోవడానికి ప్రయత్నించాడు, కాని కృష్ణా జిల్లా పోలీసులు తన ప్రత్యేక విమానం గన్నవరం విమానాశ్రయానికి హైదరాబాద్ నుండి బయలుదేరకుండా చూసుకున్నారు.
రహదారి మార్గంలో వెళ్లాలని పవన్ భావించగా, ఎన్టీఆర్ జిల్లాలో అతని కాన్వాయ్ రెండుసార్లు బ్లాక్ చేయబడింది, దీంతో పవన్ కళ్యాణ్ తన వాహనం నుండి దిగి విజయవాడలోని మంగళగిరి వైపు నడిచాడు. విజయవాడ వైపు వెళ్లకుండా అడ్డుకోవడంతో కళ్యాణ్ అనుమంచిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించారు. కళ్యాణ్, మనోహర్లను ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్నామని, వారిని విజయవాడకు తీసుకెళ్తున్నామని నందిగామ సబ్డివిజనల్ పోలీస్ ఆఫీసర్ జనార్దన్ నాయుడు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ తనని ముందుకు కదలనివ్వకుండా ఉంచడంపై నిరసనగా రోడ్డుపై పడుకొని నిరసన తెలియజేశాడు.

తాజాగా దీనిపై కొడాలి నాని స్పందించారు. పవన్ కళ్యాణ్ వస్తే జడ్జిగారిని భయపెట్టి బెయిల్ ఇప్పించేవాడు. అసలు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన కొడుకు లోకేష్, భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి అందరు బాగానే ఉన్నారు. ఏసీ కార్లలో తిరుగుతున్నారు. మరి ఈయన ఎందుకు రోడ్డు మీద పడుకున్నాడో జనానికి అర్ధం కావడం లేదు. చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు జైలులో ఉన్నప్పుడు ఎంతమంది లాయర్లని తీసుకొచ్చాడు. లాయర్ అంటాడు, 24 గంటలు దాటింది కాబట్టి బెయిల్ ఇచ్చేయాలని అంటాడు, మరొకడు గవర్నర్ పర్మీషన్ తీసుకోలేదు కాబట్టి బెయిల్ ఇచ్చేయాలని అంటాడు. ఇవా వీళ్లు చేసేదని కొడాలి నాని కడిగిపడేశాడు.