Kodali Nani : జ‌గ‌న్ విష‌యంలో కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారుగా..!

Kodali Nani : ఈ సారి వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు జ‌గ‌న్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌న పార్టీకి సంబంధించి జోరుగా ప్రచారాలు చేస్తున్నారు.అయితే ఇటీవ‌ల సీఎం వైఎస్ జగన్ మీద జరిగిన దాడి ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార, ప్రతిపక్షాలు దీనిపై మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్లదాడిపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ మీద పక్కా ప్లాన్ ప్రకారం దాడి జరిగిందని కొడాలి నాని ఆరోపించారు. “జగన్ మీద జరిగింది రాయి దాడి కాదు. చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారం, గురిచూసి కొట్టాలని చూశారు. సీఎం జగన్ కదలడం వలన గురి తప్పి కన్ను వద్ద తగిలింది. దేవుడు దీవెనలు, ప్రజల ఆశీస్సులతోనే సీఎం జగన్ గాయంతో బయటపడ్డారు.

అయితే దానిని ఖండించాల్సిన పెద్దలు.. సంస్కారహీనంగా జగనే దాడి చేయించుకున్నారని మాట్లాడుతున్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తున్నారు. దేశంలోని పది సంస్థలు సర్వే చేస్తే 9 సంస్థల సర్వేల్లో 125 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్తున్నాయి. అందుకే రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోలేని రాజకీయ నిరుద్యోగులు, విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం ఓర్చుకోలేని వర్గాలు జగన్ మీద దాడి చేశాయి” అని కొడాలి నాని ఆరోపించారు.

Kodali Nani sensational comments on cm ys jagan
Kodali Nani

ముఖ్యమంత్రి జగన్ పై దాడి వెనక అనేక మంది పెద్దలున్నారని ఆయ‌న అన్నారు. తుళ్లూరులో చంద్రబాబు జగన్ తో రాళ్లకొట్టాలని పిలుపునిచ్చారని, ఆ తర్వాత ఈ ఘటన జరిగిందని అన్నారు. పచ్చ దండు కులన్మోదంతో ముదిరిపోయిన పిచ్చి పరాకాష్టకు ఎక్కించుకున్న ఉన్మాదులు ఈ దాడికి పాల్పడ్డారన్నారు. పకడ్బందీ పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నారు. దాడి చేసిన వారిపైన, దాడి వెనక ఉన్న వారిపై కూడా కఠినంగా శిక్షించాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. గురి చూసి గన్ తోనే కొట్టారని అన్నారు. వీడియోలు నా వద్ద ఉన్నాయి. చంద్రబాబు మాటలు విని కొంతమంది జగన్‌ను చంపడానికి ప్రయత్నించారు. ఎంత వేగంగా వస్తే జగన్‍‌కు తగిలి మళ్లీ వెల్లంపల్లికి రాయి తగిలి అతనికి కూడా గాయమవుతుందా?. కరెంట్ తీసేశారని టీడీపీ వాళ్లు అంటున్నారు. ప్రధాని, సీఎం స్థాయి వ్యక్తులు ర్యాలీగా వెళ్తున్నప్పుడు కరెంట్ తీయడం సహజం. వైర్లు తగిలి ప్రమాదం జరుగుతుందని కరెంట్ తీసేస్తారు. ఇది టీడీపీ వాళ్లకు తెలియదా? చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికలప్పుడు దాడి జరిగింది. ఇప్పుడు జరిగింది”అని కొడాలి నాని ఆరోపించారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago