టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్తో ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్..టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడతామని, బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకపై టీడీపీతో కలిసి ఉమ్మడి పోరాటం చేస్తామంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆచితూచి స్పందిస్తుంది. జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని, మిగతా పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది ఏపీ బీజేపీ. ప్రాంతీయ పార్టీలు స్థానికంగా నిర్ణయించవచ్చని జాతీయ పార్టీల నిర్ణయం ఢిల్లీ నుంచే రావాలని ఏపీ బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు.
ఎన్డీయే కూటమిలో ఉన్న పవన్ కల్యాణ్.. ఆ కూటమిలో ప్రస్తుతం భాగస్వామ్యం లేని టీడీపీతో తమ పార్టీ పొత్తు ఉంటుందని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ముందుగా బిజేపీ కి తెలుసా, లేక సొంతంగానే ప్రకటన చేశారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే పవన్ మాటలు చూస్తే.. బీజేపీకి సమాచారం ఇవ్వకుండానే ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేనల పొత్తు ఉంటుందని పవన్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.
పొత్తులను ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు నిర్ణయిస్తారని ఏపీ బీజేపీ తెలియజేసింది. ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ.. ఇది రాష్ట్ర స్థాయిలో తేల్చే వ్యవహారం కాదని.. ప్రస్తుతానికి జనసేనతో స్నేహబంధం కొనసాగుతుందన్నారు. పొత్తులు, మార్పులు ఉంటే అధిష్టానమే చెబుతుందని ఆయన పేర్కొన్నారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని, బీజేపీ కూడా కలిసివస్తుందన్న పవన్ కళ్యాణ్ ప్రకటనను ఏపీ బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి స్వాగతించారు. మూడు పార్టీలూ కలిసి వెళ్లాలనేది తన కోరిక కూడా అని చెప్పారాయన. ఇప్పటికే పొత్తులపై పవన్ బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడారని, త్వరలోనే ప్రకటన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆదినారాయణ రెడ్డి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…