Balakrishna : నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరో బాలకృష్ణ. ఆయనకు ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య ఓటీటీ వేదికగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’ షోతో ఇరగదీస్తున్నారు. ఇక బాలయ్య తన భార్య వసుంధర గురించి ఇటీవల ‘అన్ స్టాపెబుల్’షోలో బాలయ్య ప్రస్తావించారు. తన భార్యకు బాలయ్య.. ఐ లవ్ యూ కూడా చెప్పారు. ఈ సందర్భంగా ఇంతకీ బాలయ్య భార్య ఎవరు? ఆమెకు ఉన్న ఆస్తి విలువ ఎమిటి అనేది చర్చనీయాంశం అయింది.
ఎన్టీఆర్కి 11 మంది సంతానంలో ఆయన చిన్న కొడుకు బాలకృష్ణ మాత్రమే సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ రాణించగలుగుతున్నాడు. బాలయ్య చిన్న కొడుకు కావడంతో ఎన్టీఆర్ అతన్ని చాలా గారంగా చూసుకునేవారట. ఇక తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్.. ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. అదే టైములో ఎన్టీఆర్ భార్య బసవతారకం గారు చిన్న కొడుకుకి పెళ్లి చేయాలని సంబంధాలు చూడమని ఎన్టీఆర్ పై ఒత్తిడి చేసేవారట. దాంతో ఎన్టీఆర్ ఆ బాధ్యతని తన సహచరుడు, ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కర రావుకు అప్పగించగా అతను వసుంధర ఫ్యామిలీ సంబంధం తెచ్చాడు.
శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్పోర్ట్ అధినేత అయిన దేవరపల్లి సూర్య రావు గారి అమ్మాయి వసుంధర. ఆమె సొంతంగా వందల కోట్ల ఆస్తులకు వారసురాలు కూడా. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బాలకృష్ణని పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో బాలయ్యకి ఈమె కుటుంబ సభ్యులు రూ.10 లక్షలు కట్నం ఇచ్చారట. ఆ కట్నంతోనే హైదరాబాద్లో వారికి ఇల్లు కట్టించి ఇచ్చారట అమ్మాయి కుటుంబ సభ్యులు. బాలయ్య దంపతులకి బ్రాహ్మణి , తేజస్వి, మోక్షజ్ఞ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బ్రాహ్మణిని నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కు ఇచ్చిన వివాహం చేయగా.. తేజస్విని వైజాగ్ గీతం సంస్థలకు చెందిన శ్రీ భరత్ కు ఇచ్చి వివాహం చేశారు. కొడుకు మోక్షజ్ఞ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…