Balakrishna : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన రెండో మూవీ ‘లెజెండ్’. సరిగ్గా పదేళ్ల క్రితం 2014 మార్చి 28న విడుదలైన ఈ సినిమా ఇటీవల దశాబ్దాం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు అప్పట్లో లెజెండ్ సినిమా ఘన విజయం తెలుగు దేశం పార్టీ ఎన్నికల్లో గెలుపుకు ఓ ఊపు తీసుకొచ్చింది. సింహా తర్వాత సరైన సక్సెస్లేని బాలయ్యకు మళ్లీ లెజెండ్ మూవీతో మళ్లీ పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ పదేళ్లు పూర్తి చేసుకోవడంతో హైదరాబాద్ లో మూవీ యూనిట్ ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, టాలీవుడ్ లో రియల్ లెజెండ్ ఒక్కప్పటి స్టార్ నటులు విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు గారు అని అన్నారు. అందుకే ఆయనని స్మరిస్తూ ఈ మూవీ ప్రారంభంలో చూపించడం జరిగిందన్నారు. ఇక ఈ సినిమా కోసం బాలకృష్ణ గారితో పాటు టీమ్ మొత్తం కూడా ఎంతో కష్టపడి పని చేసారని, అందుకే బాలయ్య ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మూవీకి విశేషమైన రెస్పాన్స్ లభించిందని, ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ఫుల్ గా పదేళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక పై తమ కాంబినేషన్ లో రానున్న సినిమాలకు మరింత శ్రద్ద, దీక్షతో పని చేస్తాం అని, బాలయ్యతో మరిన్ని సినిమాలు చేయాలనేది తన ఆలోచన అన్నారు బోయపాటి.
నటుడు సమీర్ ‘లెజెండ్’ సినిమా విజయోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఎన్టీఆర్ తో నటించాలన్న కోరిక ఉండేదని, అయితే, అది నెరవేరలేదని తెలిపారు. అయితే, బాలకృష్ణతో నటించడంతో ఆ లోటు తీరిపోయిందని అన్నారు. తాను ఇప్పటివరకు మూడు చిత్రాల్లో బాలయ్యతో నటించానని, ఆయనతో నాలుగో చిత్రం కూడా చేస్తున్నానని, ఆ సినిమా ఫ్యాన్స్ కు పండగేనని చెప్పారు. ఇక, ‘సింహా’ సినిమా సమయంలో దర్శకుడు బోయపాటితో ఆసక్తికర సంభాషణ జరిగిందని సమీర్ తెలిపారు. ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయిలో చూపించారని, లెజెండ్ లో ఇంకేమి చూపగలరని బోయపాటిని అడిగానని చెప్పారు. అందుకు బోయపాటి, ‘సింహా’లో ఒక్కటే సింహం ఉంటుందని, ‘లెజెండ్’ పది సింహాల పెట్టు అని చెప్పారని సమీర్ గుర్తు చేసుకున్నారు.అయితే సమీర్, బాలయ్యలు ఈవెంట్లో చేసిన సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…