Babar Azam : వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో భారత్ పాకిస్థాన్పై అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం విదితమే. తక్కువ పరుగులే చేసినప్పటికీ భారత్ అద్భుతమైన బౌలింగ్తో పాక్ను కట్టడి చేసింది. దీంతో భారత్ పాకిస్థాన్పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ మొదటి 10 ఓవర్ల వరకు తమ జట్టు భారత్పై పట్టు సాధించిందని తెలిపాడు. కానీ తరువాతి ఓవర్లలో డాట్ బాల్స్ ఎక్కువగా ఆడామని, అలాగే వరుసగా వికెట్లను కోల్పోయామని తెలిపాడు.
డాట్ బాల్స్ను ఎక్కువగా ఆడడం, వరుసగా వికెట్లను కోల్పోవడంతో చేయాల్సిన పరుగులు పెరిగిపోయాయని, దీంతో ఒత్తిడి పెరిగి సరిగ్గా ఆడలేకపోయామని తెలిపాడు. వికెట్లను కాపాడుకుని ఉంటే చివర్లో పరుగులు వచ్చేవని అభిప్రాయపడ్డాడు. కాగా భారత్ తన ఇన్నింగ్స్లో కేవలం 119 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిన విషయం విదితమే. ఈ క్రమంలో పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కాగా ఇప్పటికే పాకిస్థాన్ అమెరికా చేతిలో ఓడిన విషయం విదితమే. దీంతో పాకిస్థాన్ సూపర్ 8 చేరే అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఒక వేళ తదుపరి మ్యాచ్లలో కెనడా, ఐర్లాండ్లను భారీ తేడాలో ఓడించినా అమెరికా ఇంకో మ్యాచ్ గెలిస్తే వారే సూపర్ 8కు చేరే చాన్సులు ఎక్కువగా ఉంటాయి. అమెరికా తదుపరి మ్యాచ్లలో భారత్, ఐర్లాండ్ చేతిలో ఓడాలి. అప్పుడు కూడా పాక్కు మెరుగైన రన్ రేట్ ఉండాలి. ఇలా జరిగితేనే పాక్ సూపర్ 8కు చేరే చాన్సులు ఉంటాయి. లేదంటే కష్టమే అని చెప్పాలి. ఇక భారత్ తన తరువాతి మ్యాచ్ను అమెరికాతో ఈనెల 12వ తేదీన ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం ఆ రోజు రాత్రి 8 గంటలకు న్యూయార్క్లో మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…