Ramya Krishnan : మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కాగా, ఈ మూవీకి మిశ్రమ స్పందన దక్కింది. చిత్ర కథ పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే ఉందని కొందరు కామెంట్ చేశారు. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ముచ్చటగా మూడోసారి వచ్చిన ఈ సినిమా ఎందుకో బెడిసి కొట్టింది. అయితే రీసెంట్గా ఈ మూవీ సక్సెస్ పార్టీ కూడా జరుపుకుంది. అయితే గుంటూరు కారం మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ జే సూర్య కాంబినేషన్ లో వచ్చిన నాని సినిమాలో కూడా రమ్యకృష్ణ నటించగా,ఇందులో రమ్య కృష్ణ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. మహేష్ తో కలిసి ఓ రొమాంటిక్ సాంగ్ లో స్టెప్పులేశారు రమ్య కృష్ణ. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ నటించారు. అప్పుడు మహేష్ బాబుతో రొమాన్స్ పండించిన రమ్యకృష్ణ ఇప్పుడు గుంటూరు కారం చిత్రంలో ఆయనకు తల్లిగా నటించే సరికి ప్రతి ఒక్కరు అవాక్కయ్యారు.
ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు నటించిన నాని, సినిమా అప్పట్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ‘నాని’లో రమ్యకృష్ణ, మహేష్ మధ్య ఓ మాస్ మసాలా రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ‘మార్కండేయా’ అంటూ సాగే ఈ పాటలో రమ్యకృష్ణ అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. కారణాలు ఏంటో తెలియదు కానీ, తర్వాత ఈ సినిమా నుంచి ఆ పాటను తొలగించారు. యూట్యూబ్ లో మాత్రం ఇప్పటికీ కనిపిస్తుంది. ‘గుంటూరు కారం’ సినిమా విడుదల నేపథ్యంలో మళ్లీ ఈ పాటపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. కొందరు స్టన్నింగ్స్ కామెంట్స్ చేయగా, మరికొందరు విమర్శనాస్త్రాలు గుప్పించారు.
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…
ఏపీలో వరదలు సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొందరు ఇప్పటికీ దిక్కుతోచని స్థితిలో…
YS Jagan : ఈ ఎన్నికలలో ఘోరంగా ఓడిన జగన్ ప్రతి సందర్భంలో ప్రభుత్వంపై ఏదో ఒక విధంగా విమర్శలు…
Harish Rao : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఇష్టమొచ్చినట్టు…
గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం వలన చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…
YS Sharmila : వైఎస్ షర్మిళ ఇటు తెలంగాణ, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…