Sania Mirza : భారత్ – పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం.. సరిహద్దుల్లో నిత్యం కల్లోలాలు.. ఇక ఇరు దేశాల మధ్య క్రికెట్, హాకీ, కబడ్డీతో పాటు ఏ క్రీడ అయినా అదొక టగ్ ఆఫ్ వార్గా నడుస్తుంది. అయితే ఇంత క్లిష్టమైన సమయంలో సానియా మీర్జా – షోయబ్ మాలిక్లు వివాహబంధంతో కలవడం అనేది కచ్చితంగా ఆశ్చర్యం కలిగించేదే. ప్రేమకు సరిహద్దులతో సంబంధం లేదని, మనసులు కలిస్తే మనుషులను గెలవడం అంత కష్టమేమీ కాదని నమ్మిన ఆ జంట.. పుష్కరకాలం కూడా కలిసుండలేకపోయింది. సానియా మీర్జాను షోయబ్ మాలిక్ 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటికీ మాలిక్కు రెండో వివాహం. తన తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల అనంతరం సానియాను పెళ్లి చేసుకున్నాడు. అయితే తాజాగా పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్ను మాలిక్ వివాహమాడాడు. ఈ కొత్త జంటకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ మారాయి.
సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోతున్నట్లుగా గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు రెండేళ్ల క్రితమే వార్తలు మొదలయ్యాయి. విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ ఆ తర్వాత ఆ వార్తలకు బ్రేక్ పడింది. అయితే తాజాగా సానియా మీర్జా చేసిన పోస్ట్తో మరోసారి విడిపోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ‘పెళ్లి కష్టం, విడాకులు కష్టమే. మీరు కఠినంగా ఉండి, సరైన దాన్ని ఎంచుకోండి. మనం ఎప్పుడూ మన కష్టాన్నే నమ్ముకోవాలి’ అంటూ సానియా ఓ కొటేషన్ను తన పోస్ట్లో రాసుకొచ్చింది.
గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా తాను రెండో పెళ్లి చేసుకున్న ఫొటోలను షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడం సంచలనం రేపింది. పాకిస్థాన్ నటి సనా జావెద్ ను తాను పెళ్లి చేసుకున్నట్టు షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి అఫీషియల్ గా ప్రకటించాడు. సనాను పెళ్లి చేసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. పెళ్లి దుస్తుల్లో ఉన్న కొత్త జంట ఫొటోలు చూసి సానియా, షోయబ్ విడాకులు తీసుకున్న సంగతి నిజమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజులుగా సానియా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుు చూసి చాలామంది వారు విడిపోయారని నిర్ధారణకు వచ్చారు.ఇక సనా విషయానికి వస్తే ఆమె వయస్సు 28 ఏళ్లు. అనేక టీవీ షోల్లో కనిపించింది. ‘ఏ ముష్త్-ఎ-ఖాన్’, ‘డంక్’ అనే షోలతో ఆమెకు గుర్తింపు లభించింది. అయితే 2020లో ఉమైర్ జస్వాల్ను ఆమె వివాహం చేసుకుంది. కానీ కొద్దికాలానికే ఈ దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…