Lalitha Jewellery Owner : లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ పేరు చెప్పగానే అందరికీ ఆయన ప్రతిరూపం గుర్తొస్తుంది. నున్నటి గుండు, టీ షర్ట్, చేతికి కళ్లద్దాలతో చాలా అమాయకంగా కనిపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఒకప్పుడు చాలా పేద కుటుంబంలో జీవించిన కిరణ్ కుమార్ అతి కొద్ది సమయంలోనే కోటీశ్వరుడిగా ఎదిగాడు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అంటూ ఫుల్ ఫేమస్ అయ్యాడు కిరణ్. సినిమా, స్పోర్ట్స్ స్టార్స్, మోడల్స్ చేస్తేనే కమర్షియల్ యాడ్ సక్సెస్ అవుతుందన్న నమ్మకాన్ని.. తల్లకిందులు చేసిన తెలివైన బిజినెస్మ్యాస్ లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్.
ఎక్కువ శాతం మంది ఆయన మాట తీరును చూసి తెలుగు వ్యక్తి కాదనుకుంటారు. కానీ ఆయన పక్కా తెలుగు వ్యక్తి. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి, అయితే తమిళనాడుకు కాస్త దగ్గరగా ఉండటం వల్ల భాష మరియు యాసలో కొంచెం సారుప్యత ఉంటుంది. కిరణ్ కుమార్ నెల్లూరులో బంగారపు వస్తువులు తయారు చేసే వర్క్ షాపులో నెల సరి జీతానికి పని చేసేవాడు. 1999లో లలితా జ్యూవెలరీని నేను టేకోవర్ చేశానని.. నేను ఒరిజినల్ ఓనర్ ని కాదు. కందు స్వామి అనే అతను ఒరిజినల్ ఓనర్. అతని వద్ద నుంచి తాను టేకొవర్ చేసినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
లలితా జ్యూవెలరీస్ అనగా జయలలిత సంబంధించినదని అందరు భావిస్తున్నారు. దానిపై క్లారిటీ ఇవ్వమని అడడగా, ఎవరు ఏమైనా అనుకోనీ.. నాకు సంబంధం లేదని పేర్కొన్నారు. సోనియా అంటే సోనియాగాంధీది అనేవారు. మోడీ జ్యూవెలరీస్ అంటే నరేంద్ర మోడీ అని అనుకునేవారు ఉన్నారు. ఏం చేస్తాం అని ఆయన బదులిచ్చారు. భారతదేశం అంతటా 450 షోరూంలు ఏర్పాటు చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా కిరణ్ తెలియజేశారు. ఓసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు తలనీలాలు సమర్పించాను. ఆ సమయంలో పక్కన ఉన్న వారు నేను గుండులో బాగున్నానని కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి గుండులోనే ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నాను అని తన గుండు సీక్రెట్ కూడా చెప్పారు కిరణ్.
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…
ఏపీలో వరదలు సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొందరు ఇప్పటికీ దిక్కుతోచని స్థితిలో…
YS Jagan : ఈ ఎన్నికలలో ఘోరంగా ఓడిన జగన్ ప్రతి సందర్భంలో ప్రభుత్వంపై ఏదో ఒక విధంగా విమర్శలు…
Harish Rao : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఇష్టమొచ్చినట్టు…
గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం వలన చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…
YS Sharmila : వైఎస్ షర్మిళ ఇటు తెలంగాణ, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…