RK Roja : మ‌ళ్లీ యాక్టివ్ అయిన రోజా.. జ‌గ‌న్ సంస్క‌ర‌ణ‌లే గ‌ట్టెక్కిస్తాయంటూ కామెంట్..

RK Roja : ఏపీలో దారుణాతి దారుణంగా ఓడిన త‌ర్వాత రోజా మ‌ళ్లీ క‌నిపించింది లేదు. ఆమె సోష‌ల్ మీడియాకి కూడా దూరంగా ఉంటూ వ‌చ్చింది. తాజాగా రోజా చేసిన ట్వీట్ ఇప్పుడు రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలే ఇప్పుడు విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయంటూ రోజా ట్వీట్ చేశారు. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, జగనన్న నియమించిన వలంటీర్ వ్యవస్థ, జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్, జగనన్న హయాంలో కొన్న 108, 104వాహనాలు, జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు, జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్రా వాహనాలు,వజగనన్న తీసుకొచ్చిన వైఎస్సార్ హెల్త్ సెంటర్లే ప్రస్తుతం విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయంటూ రోజా ట్వీట్ చేశారు.

విజయవాడలో వరదలు అల్లకల్లోలం సృష్టించాయి.34 మంది వరకూ చనిపోగా.. లక్షల మంది వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం ఎంతమేర అనేది తెలియాల్సి ఉంది. అయితే బుడమేరు వాగు సాగించిన విలయం నుంచి బెజవాడ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో నీటిలో మునిగిన తమ ఇళ్లను శుభ్రపరుచుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఫైరింజన్ల సాయంతో వీరి ఇళ్లను క్లీన్ చేయించే పనిలో ఉంది. అలాగే వరదల కారణంగా సర్వం కోల్పోవటంతో తక్షణ సాయంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఇక బాధితుల కోసం సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ విరాళాలు అందిస్తుండగా.. సామాన్యులు సైతం తమకు చేతనైనంత సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

RK Roja comments on cm ys jagan about his development works
RK Roja

అయితే విజయవాడ వరదలు, ప్రభుత్వ సహాయక కార్యక్రమాలు ఇలా ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత రోజా కీలక ట్వీట్ చేశారు. మరోవైపు విజయవాడ వరదలకు మీరంటే మీరు కారణమంటూ అధికార టీడీపీ కూటమి, విపక్ష వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలే బెజవాడ వాసులను ఈ విపత్తు నుంచి గట్టెక్కిస్తున్నాయని రోజా చెప్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో బుడమేరు వాగు ఆక్రమణకు గురైన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదనేదీ టీడీపీ నేతల వాదన. మరోవైపు ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారనేదీ వైసీపీ ఆరోపణ. ఇదే సమయంలో వాలంటీర్లు ఉంటే ప్రజలను అప్రమత్తం చేసేవారని.. అలాంటి వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

17 hours ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

1 day ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

1 day ago

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ల‌లితా జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ ఎంత స‌హాయం చేశారో తెలుసా..?

ఏపీలో వ‌ర‌ద‌లు సృష్టించిన వినాశ‌నం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. కొంద‌రు ఇప్ప‌టికీ దిక్కుతోచ‌ని స్థితిలో…

1 day ago

YS Jagan : జైలు ముందు జ‌గ‌న్‌తో మ‌హిళా కానిస్టేబుల్ సెల్ఫీ.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

YS Jagan : ఈ ఎన్నిక‌ల‌లో ఘోరంగా ఓడిన జ‌గన్ ప్ర‌తి సంద‌ర్భంలో ప్ర‌భుత్వంపై ఏదో ఒక విధంగా విమ‌ర్శలు…

1 day ago

Harish Rao : కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం పోయింది: హ‌రీష్ రావు

Harish Rao : తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, ఇష్ట‌మొచ్చిన‌ట్టు…

2 days ago

ఏపీ మందు బాబుల‌కు గుడ్ న్యూస్‌.. త‌క్కువ ధ‌ర‌కే మ‌ద్యం..?

గ‌త ప్ర‌భుత్వంలో నాసిర‌కం మ‌ద్యం వ‌ల‌న చాలా మంది చాలా ఇబ్బందులు ప‌డ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…

2 days ago

YS Sharmila : చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర పాకెట్ మ‌నీ వ‌సూలు చేయ‌డం ఏంటి: ష‌ర్మిళ

YS Sharmila : వైఎస్ ష‌ర్మిళ ఇటు తెలంగాణ‌, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…

5 days ago