CM Yogi : తెలంగాణలో ఎన్నికలు మరో మూడు రోజులలో జరగనుండగా, ప్రచారాలు హోరెత్తిస్తున్నారు. బీజేపీ కూడా అధికారం కోసం పాకులాడుతుంది. ఈ క్రమంలో యోగి ఆధిత్యనాథ్ కూడా ప్రచారం చ,ఏశాడు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్యలో శ్రీరాముడి దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తామనిఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహబూబ్ నగర్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో సరిహద్దు ప్రశాంతంగా ఉందన్నారు. దేశంలో ఎలాంటి అలజడులు లేవన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కాంగ్రెస్ వల్ల అయ్యేదా? అని ప్రశ్నించారు. నడుస్తోంది నరేంద్రమోదీ ప్రభుత్వం అని, అవినీతిపరులను వదిలే ప్రభుత్వం కాదన్నారు.
తాను సీఎంగా ఉన్నానని కానీ ఏనాడూ అధికార దర్పాన్ని ప్రదర్శించ లేదన్నారు యోగి ఆదిత్యానాథ్ . పదవులు శాశ్వతం కాదన్నారు. కానీ మనం చేసిన పనే మనల్ని గెలిపించేలా చేస్తాయని స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ తాను దైవాంస సంభూతుడినని తనకు తానుగా భావిస్తున్నారని ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. గడీల పాలనలో లెక్కకు మించిన గాయాలు ఉన్నాయని వీటిని పూర్తిగా మానేలా చేయాలంటే కేవలం బీజేపీ నుంచి మాత్రమే సాధ్యమవుతుందన్నారు యోగి ఆదిత్యానాథ్. ప్రజలు పాలన సాగించమని గెలిపిస్తే సచివాలయానికి రాకుండా, ప్రజా దర్బార్ నిర్వహించకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతే ఎలా అని కేసీఆర్ ను ప్రశ్నించారు.
జనం మార్పు కోరుకుంటున్నారని వారంతా బీజేపీ రావాలని కంకణ బద్దులై ఉన్నారని స్పష్టం చేశారు యూపీ సీఎం. అయితే ఈ మీటింగ్లో యోగి తెలుగులో మాట్లాడడం ప్రాధన్యత సంతరించుకుంది. నమస్కారం తెలంగాణ. సోదరీ సోదరీమణుల్లారా అందరికి నమస్కారం అంటూ యోగి తెలుగులో మాట్లాడేసరికి జనాలు తెగ గోల చేశారు. చప్పట్లో ప్రశంసించారు. ప్రస్తుతం యోగికి సంబంధించిన వీడియో విడుదల కానుంది.
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…
ఏపీలో వరదలు సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొందరు ఇప్పటికీ దిక్కుతోచని స్థితిలో…
YS Jagan : ఈ ఎన్నికలలో ఘోరంగా ఓడిన జగన్ ప్రతి సందర్భంలో ప్రభుత్వంపై ఏదో ఒక విధంగా విమర్శలు…
Harish Rao : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఇష్టమొచ్చినట్టు…
గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం వలన చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…
YS Sharmila : వైఎస్ షర్మిళ ఇటు తెలంగాణ, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…