Renuka Chowdary : తెలంగాణ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రాజకీయం మరింత వేడెక్కిపోతుంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అలానే ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ గాలి వీస్తోందని రేణుకా చౌదరి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత మెజారిటీ తప్పకుండా సాధిస్తామని, సీఎం ఎవరనేది గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్టానం నిర్ణయిస్తారని చెప్పారు. డీకే శివకుమార్లా పదవిని త్యాగం చేసే గుణం అందరిలో ఉండాలంటూ సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సీట్లను ఖచ్చితంగా గెలుస్తామంటూ రేణుకా చౌదరి పేర్కొన్నారు.
ఏపీలో నేను పోటీ చేయాలని, ప్రచారం చేయాలని ఆహ్వానం ఉంది.. ఏపిలో నరకం అనుభవిస్తున్నారు.. విభజన జరిగినా సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. చంద్రబాబు అరెస్ట్ తీరుని రేణుకా ఖండించగా,ఇప్పడు ఆయన తెలంగాణలో పోటీ చేయకపోవడంపై కూడా ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. బేరం పెట్టుకోకుండా పెద్దమనసుతో కాంగ్రెస్ గెలవాలని వారు పోటీ చేయకుండా ఉండడం గొప్ప విషయం . ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అందరు కలుస్తున్నారు. హస్తానికి ఐదు వేళ్లు ఎలా ఉన్నాయో అలానే అందరు కలిసి గెలవాలని కోరుకుంటున్నారు అని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. తెలుగుదేశం పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎఫెక్టు పడిందన్నారు.
![Renuka Chowdary : చంద్రబాబు తెలంగాణలో ఎందుకు పోటీ చేయట్లేదో చెప్పిన రేణుకా చౌదరి Renuka Chowdary told why chandra babu not contesting in telangana](https://i0.wp.com/telugunews365.com/wp-content/uploads/2023/11/renuka-chowdary.jpg?resize=1200%2C675&ssl=1)
పువ్వాడ అజయ్ దుష్టుడు, దుర్మార్గుడు అంటూ రేణుక విరుచుకుపడ్డారు. ఆయన డీఎన్ఏలోనే లోపం ఉందని విమర్శించారు. ఎవరూ కూడా నిస్సహాయంగా ఉండొద్దని… ఓటు అనే ఆయుధంతో అజయ్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మన భవిష్యత్తు కోసం తుమ్మల నాగేశ్వరరావును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ఎన్నికలు చరిత్రలో మిగిలిపోతాయని అన్నారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.