Pawan Kalyan : చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారారు.ఆయన రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుని ములాఖత్ అయ్యేందుకు అక్కడకి వెళ్లగా పలువురు టీడీపీ నాయకులని కూడా కలిసారు. ఆ సమయంలో బాలయ్య ఒక్కొక్కరిని పరిచయం చేస్తుండగా, పవన్కి ఉండవల్లి శ్రీదేవి కూడా ఎదురు పడింది. గతంలో ఉండవల్లి శ్రీదేవి.. పవన్పై ఎన్ని విమర్శలు చేసిందో మనం చూశాం.పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో తన లాంటి కొత్త వాళ్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో గెలిచి అసెంబ్లీకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ మాత్రం పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని ఎమ్మెల్యే శ్రీదేవి సెటైర్లు విసిరారు. 6 నెలలకు ఓసారి కనిపించే పవన్నాయుడు వల్ల జరిగేది ఏం లేదని వ్యాఖ్యానించారు.
అలా పవన్ కళ్యాణ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన ఉండవల్లి శ్రీదేవి ఇప్పుడు టీడీపీలోకి రాగా, ఆమెని బాలయ్య.. పవన్ కళ్యాణ్కి పరిచయం చేశాడు. ఆ సమయంలో శ్రీదేవి ఎక్స్ప్రెషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ని తిట్టింది ఈమెనేనా అని అందరిలో అనుమానం కలిగింది. అలానే రామ్మోహన్ నాయుడు కూడా పవన్తో సెల్ఫీ తీసుకునేందుకు వెనుకపడుతున్నట్టుగా కనిపించాడు. మొత్తానికి పవన్ ని తిట్టిన వారు ఇప్పుడు ఆయన వెనక పడుతుండడం అందరికి చాలా కొత్తగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
![Pawan Kalyan : చంద్రబాబు ఇంట్లో టీడీపీ లీడర్స్తో పవన్ కళ్యాణ్ పరాచకాలు..! Pawan Kalyan make fun of tdp leaders](https://i0.wp.com/telugunews365.com/wp-content/uploads/2023/09/pawan-kalyan-3.jpg?resize=1200%2C675&ssl=1)
ఇక పవన్ కళ్యాణ్.. చంద్రబాబుతో ములాఖత్ కోసం ముందు అనుమతి తీసుకోగా.. ఆయన బాలయ్య, లోకేష్ తో కలిసి మధ్యాహ్నం 12 గంటల సమయంలో జైలుకు వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. ముందుగా బాలయ్య, లోకేష్ జైల్లోకి వెళ్లగా.. అనంతరం పవన్ కళ్యాణ్ విడిగా వెళ్లి ములాఖత్ అయ్యారు. చంద్రబాబుని కలిసి వచ్చాక పవన్ కళ్యాణ్..టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్టు సంచలన ప్రకటన చేశారు.