YS Sharmila : వైఎస్ జగన్ సోదరి, రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డితో ఈ నెల 18న అట్లూరి ప్రియ నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల తొలి ఆహ్వాన పత్రికను ఉంచి.. వైఎస్సార్ ఆశీస్సులు తీసుకున్నారు.. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల కలిశారు. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి రేవంత్ను కలుసుకున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. . దీనికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కాబోయే వధూవరులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉంటే.. షర్మిల తన పార్టీ వైఎస్ఆర్టీపీని ఇటీవలే కాంగ్రెస్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో అధిష్ఠానం.. ఆమెను ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షరాలిగా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఏపీలో పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. షర్మిలతో భేటీ అయిన కొద్దిసేపటి తరువాతే రేవంత్ కొన్ని కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఓ తెలుగు ఛానల్ చర్చలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. అనేక విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల చుట్టూ ఎక్కువగా నడించిందీ బిగ్ డిబేట్. వైఎస్ జగన్ పరిపాలన తీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మీదా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయనే విషయాన్నీ గుర్తు చేసుకున్నారాయన .. ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల అపాయింట్ అవుతారని తేల్చి చెప్పారు. ఆమె సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలను ఎదుర్కొంటుందని పరోక్షంగా వెల్లడించారు. త్వరలోనే దీనిపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏపీలో వైఎస్ఆర్సీపీలో టికెట్ దక్కని నాయకులను తాము పార్టీలోకి చేర్చుకుంటామని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…