YS Sharmila : జగనన్న వదిలిన బాణం’.. దిశ మార్చుకుని తిరిగి జగన్పైకే వెళుతుందా అనే అనుమానాలు అందరిలో మెదులుతున్నాయి. ఏపీలో జగన్ను గద్దెదించి, కాంగ్రె్సను అధికారంలోకి తెచ్చేందుకు సంపూర్ణంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రె్సలో విలీనం చేసిన షర్మిల… ‘జగన్ పాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్ ఏ ప్రజా ప్రతినిధినీ కలుసుకోరు. తాడేపల్లి ప్యాలె్సకే పరిమితమవుతున్నారు’’ అని చెప్పారు. ఇక… తన రాజకీయ ఆకాంక్షలపై జగన్ నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జైలు పాలైనప్పుడు రాష్ట్రమంతటా తిరిగి వైసీపీని నిలబెట్టానని షర్మిల వివరించారు.
పన్నెండేళ్ల కిందట తన అన్న జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడంతో ఆయన స్థాపించిన పార్టీ భారాన్ని మోయడానికి రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల, ఆ తరువాత సొంతంగా పార్టీ స్థాపించి చేసిన రాజకీయ ప్రయాణంలో ఇదొక కొత్త మలుపు.‘‘చనిపోయిన నా తండ్రిని ఏ1 నిందితుడిగా పేర్కొన్న దుర్మార్గులు’’ అంటూ ఒకప్పుడు కాంగ్రెస్, ఆ పార్టీ నేతలను తిట్టిన షర్మిల మళ్లీ అదే పార్టీలో చేరారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని ఆపడం కోసమంటూ, తాను పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్కి మద్దతిస్తున్నట్టుగా ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాలు తమ చలవేననీ, తాము పోటీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్ దాదాపు 35 స్థానాల్లో గెలిచిందనీ షర్మిల మీడియా ముందు చెప్పారు. షర్మిల నిర్ణయాన్ని ఆ పార్టీలో పనిచేసిన కొండా రాఘవ రెడ్డి, ఏపూరి సోమన్న వంటి నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాల మార్పు గురించి చర్చ మొదలైంది.అటు జగన్తో పనిచేయలేక, ఇటు తెలుగుదేశం, బీజేపీ వంటి పార్టీల్లో చేరలేక ఉండిపోయిన కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఆ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితుల్లో, షర్మిల రాక ఆసక్తి కలిగిస్తోంది.మొదట్లో కాంగ్రెస్ను విమర్శించి, తన అన్నలాగే వైఎస్సార్టీపీ కూడా కాంగ్రెస్ వ్యతిరేక శక్తి అన్న భావన కలిగించారు షర్మిల. ఇప్పుడు ఏపీలో షర్మిల ప్రభావం ఎలా ఉంటుందన్న దానితో సంబంధం లేకుండా ఆమె రాకను జగన్ వ్యతిరేకులు, టీడీపీ అనుకూల వర్గాలు పండగ చేసుకుంటున్నాయి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…