YS Sharmila : కోడలితో మొదటిసారి ఇడుపులపాయలో కనిపించిన ష‌ర్మిల‌..!

YS Sharmila : మ‌రి కొద్ది రోజులలో ష‌ర్మిల త‌న‌యుడు పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న విష‌యం తెలిసిందే. అయితే గ‌త కొద్ది రోజులుగా ఆమె పెళ్లి ఏర్పాట్ల‌లో బిజీగా ఉంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయకు రీసెంట్‌గా వెళ్లారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారి వివాహ మొదటి పత్రికను వైఎస్సార్ సమాధి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు షర్మిల తెలిపారు. షర్మిల తల్లి విజయమ్మ, కుమార్తె అంజలి రెడ్డి, ఇతర బంధువులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనం గురించి స్పందిస్తూ.. తమ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని షర్మిల అన్నారు. తాను కాంగ్రెస్‌తో కలవడానికి సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పేశారు. దీంతో ఇన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడినట్లయ్యింది. ఇడుపుల పాయలోనే షర్మిల బస చేయగా, ఆ తర్వాత మిగిలిన పెళ్లి పనులను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. వ్యాపార, రాజకీయ రంగాల్లో ఆరితేరిన అట్లూరి కుటుంబంతో షర్మిల వియ్యం అందుకోనున్నారు. ఇక వైఎస్ షర్మిల ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకోనున్నారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం విజయవాడ నుంచి షర్మిల ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నట్లు సమాచారం.

YS Sharmila appeared in public with her daughter in law
YS Sharmila

షర్మిల కుమారుడు రాజారెడ్డికి వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17వ తేదీన అట్లూరి ప్రియతో కుమారుడి వివాహం నిశ్చయించినట్లు షర్మిల స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి 18వ తేదీన వీరి నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈనెల 4న పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆమెతోపాటు మరో 40 మంది కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్‌ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago