Virat Kohli : ప్రస్తుతం ఐపీఎల్ చాలా రంజుగా సాగుతుంది. ఇప్పుడే ఏఏ టీమ్స్ ప్లే ఆఫ్స్కి చేరుకోబోతున్నాయో అర్ధమవుతుంది. డూ ఆర్ డై మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడంతో ఆ జట్టు ఈ సీజన్ నుండి తప్పుకున్నట్టు అయింది. ప్లేఆఫ్స్కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన వేళ ఓటమిపాలైంది డుప్లెసిస్ సేన. కోల్కతా నైట్ రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లో 1 పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ టీమ్ అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే హైటెన్షన్ మ్యాచ్లో బంతి బంతికి విజయం ఇరు టీమ్స్తో దోబూచులాడింది. ఆఖరి వరకు పోరాడినా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. అయితే ఆ జట్టు ఓటమికి అనేక కారణాలు చూపిస్తున్నారు నెటిజన్స్.
విరాట్ కోహ్లీ ఔట్తో సహా ఇంకొన్ని విషయాల్లో అంపైరింగ్ మిస్టేక్స్ బెంగళూరుకు శాపంగా మారాయి. అవన్నీ అనుకూలంగా వచ్చి ఉంటే ఆ టీమ్ మరికొన్ని బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించేది. విరాట్ ఔట్ నుంచి మొదలైన అంపైరింగ్ తప్పులు సుయాష్ సిక్స్ విషయం వరకు బెంగళూరుకు వ్యతిరేకంగా వచ్చాయి. విరాట్ ఔట్ సమయంలో నడుము కంటే ఎత్తులో వచ్చిన బాల్ను డిఫెన్స్ చేయబోయి ఔట్ అయ్యాడతను. సాధారణంగా అది నో బాల్. కానీ టెక్నికల్గా చూసుకుంటే బాల్ డిప్ అయింది కాబట్టి విరాట్ను ఔట్గా ప్రకటించారు. లోమ్రోర్ను సునీల్ నరైన్ ఔట్ చేశాడు. అయితే అది నో బాల్. నరైన్ బంతి వేసిన సమయంలో అతడి ఫ్రంట్ ఫుట్ లైన్ను దాటింది. అయినా దీన్ని గమనించని అంపైర్లు ఔట్గా ప్రకటించారు.
ఏప్రిల్ 21, 2024న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1 బ్రీచ్ చేస్తే మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్,’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం కోహ్లీ లెవెల్ 1 అఫెన్స్కి పాల్పడ్డాడు. తనపై ఐపీఎల్ వేసిన జరిమానాను అంగీకరించాడు విరాట్ కోహ్లీ.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…