తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం వారసుడు. తెలుగు, తమిళంలో రూపొందిన ‘వారసుడు’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం రూ. 200 కోట్లుకు పైగా గ్రాస్ను వసూలు చేసి హవాను చూపిస్తోంది. తెలుగులోనూ ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ను చేరేందుకు అడుగు దూరంలోనే ఉంది . పూర్తి స్థాయి కుటుంబ కథతో రూపొందిన ‘వారుసుడు’ హక్కుల కోసం పోటీ తీవ్ర స్థాయి పోటీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ మూవీ డిజిటిల్ రైట్స్ కోసం చాలా సంస్థలు ముందుకు రాగా, అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ విజయ్ సినిమా ఓటీటీ రైట్స్ను సొంతం చేసుకుందని టైటిల్ కార్డ్సులో క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమాని అన్ని భాషల్లో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంటే.. ఇది విడుదలైన నెల రోజుల లోపే డిజిటల్ స్ట్రీమింగ్ జరుపుకోబోతుందన్న మాట. అధికారిక ప్రకటన రాకున్నప్పటికీ దీనికి సంబంధించి చిత్ర వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల ఎంత పెద్ద హిట్ మూవీ అయినా నాలుగు వారాల్లో ఓటీటీలో అందుబాటులోకి తెస్తున్నారు. కాబట్టి ఈ సమాచారాన్ని కొట్టిపారేయలేం.
ఇళయదళపతి విజయ్ నటించిన ‘వారసుడు’ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుష్బూ, జయసుధ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. తమిళ్ వెర్షన్ వారిసు ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టడంతో దిల్ రాజు సేఫ్ అయ్యాడనే చెప్పాలి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…