Venkatesh : విక్టరీ వెంకటేష్ ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. ఇప్పటికీ కూడా ఆయన మంచి విజయాలు సాధిస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. ప్రస్తుతం వెంకీ మామ సైంథవ్ అనే చిత్రం చేస్తున్నారు. హిట్ ఫేం శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ, కోలీవుడ్ యాక్టర్ ఆర్య తదితరులు నటించారు. జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది. వాస్తవానికి డిసెంబరు 22నే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఆరోజు సలార్, 21న డంకీ ఉండటంతో ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.
గుంటూరు, విజయవాడ పట్టణాల్లో సెకండ్ సింగిల్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2.00 గంటలకు గుంటూరుకు సమీపంలోని వీవీఐటీ కళాశాలలో, సాయంత్రం 5.00 గంటలకు విజయవాడకు సమీపంలోని కేఎల్ యూ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ముందుగానే ప్రకటించారు. అయితే సినిమా ప్రమోషన్లో భాగంగా విజయవాడకి వచ్చిన వెంకటేష్.. స్థానిక బాబాయ్ హోటల్ వద్దకు కారులో చేరుకొని . అక్కడే టిఫిన్ చేస్తున్నవారిని ఏం టిఫిన్ టేస్టీగా ఉందని అడిగి తెలుసుకున్నారు. వారు ఇడ్లీ అని చెప్పడంతో.. ఓనర్ వద్దకు వెళ్లి నాక్కూడా ఓ ప్లేట్ ఇడ్లీ ఇవ్వండమ్మా అంటూ సరదాగా మాట్లాడారు.
ఆయన్ను చూడగానే అభిమానులు ఆనందంతో షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. అందరినీ వెంకీ మామ.. ఆప్యాయంగా పలకరించారు. వారితో పాటే ఓ టేబుల్పై కూర్చొని ఇడ్లీ ఆరగించారు. అంత పెద్ద స్టార్ హీరో వచ్చి తమతో టిఫిన్ చేయడం.. తమతో కలిసిపోవడం చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదంతా జరుగుతుండగా.. డైరెక్టర్ శైలేష్ కొలను వీడియో తీయడం కొసమెరుపు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైంధవ్ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తున్నారు. సంగీతం సంతోష్ నారాయణన్.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…