Venkatesh : సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అవుతోంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. యాక్షన్ , సెంటిమెంట్ అంశాలతో ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా సాగింది. . తండ్రీకూతుళ్ల బాండింగ్తో ట్రైలర్ మొదలైంది.మా నాన్న సూపర్ హీరో…నాన్న ఉంటే నాకు భయం వేయదు అంటూ ఓ చిన్నారి వెంకటేష్ గురించి చెప్పడం ఆసక్తిని పంచుతోంది. పాప ఓ రేర్ డిసీజ్తో బాధపడటం…ఆ ఇంజెక్షన్ కాస్ట్ పదిహేడు కోట్లు అని అనే డైలాగ్ తర్వాత ట్రైలర్ కంప్లీట్గా యాక్షన్ మోడ్లోకి టర్న్ అయ్యింది.
వెంకటేష్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, ఆయనపై చిత్రీకరించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్ లో గూస్బంప్స్ను కలిగిస్తున్నాయి. సైంధవ్ సినిమాకు హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. సైంధవ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాణి శర్మతో పాటు ఆండ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ట్రైలర్ రిలీజ్ అనంతరం వెంకటేష్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈక్రమంలోనే తన కొడుకు అర్జున్ గురించి మాట్లాడారు.‘మీ అబ్బాయి అర్జున్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని మీ అభిమానులు కోరుకుంటున్నారు’ అని విలేకరి ప్రశ్నించగా, వెంకటేష్ బదులిస్తూ.. “ప్రస్తుతం తను బాగా చదువుకుంటున్నాడు. ఎవరైనా సరే ముందు బాగా చదువుకోలి. ఆ తరువాత ఏం జరుగుతుంది అనేది తరువాత చూసుకోవాలి” అని బదులిచ్చారు.
ఇక యానిమల్ సినిమా చూసారా, చూస్తే సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలని ఉందా అని యాంకర్ ప్రశ్నించారు. దానికి వెంకీ స్పందిస్తూ.. సందీప్తోనా అంటూ ఆయనకి ఫోన్ చేయండని సరదాగా అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సైంధవ్ సినిమా తెలుగు, హిందీతో పాటు పాన్ ఇండియన్ లెవల్లో రిలీజ్ అవుతోంది. సైంధవ్ సినిమాను తొలుత క్రిస్మక్కు రిలీజ్ చేయాలని భావించారు. కానీ ప్రభాస్ సలార్ క్రిస్మర్కు బాక్సాఫీస్ బరిలో నిలవడంతో సైంధవ్ సంక్రాంతికి వచ్చేస్తోంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…