టాలీవుడ్ దర్శకులు ఎందరో ఉన్నారు, కానీ త్రివిక్రమ్ రూటే సపరేటు అని చెప్పవచ్చు. రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్ మాటలతో ప్రేక్షకులను మాయ చేస్తూ ఉంటాడు. అందుకే త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు అయ్యాడు. తన సినిమాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తూ టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు, జులాయి అత్తారింటికి దారేది, అలావైకుంఠపురంలో సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు.
ఇక అలా వైకుంఠపురంలో సినిమా షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగిందని త్రివిక్రమ్ ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో చెప్పారు. తన భార్యను సాధారణంగా ఎప్పుడూ షూటింగ్ లకు తీసుకువెళ్లలేదని చెప్పారు. కానీ అలా వైకుంఠపురంలో సినిమాలోని సామజవరగనమన పాట షూటింగ్ కోసం పారిస్ వెళ్లామని, అప్పుడు తన భార్యను కూడా వెంట తీసుకువెళ్లానని త్రివిక్రమ్ తెలిపారు. కానీ రెండు రోజులకే తన భార్య నీరసించిపోయిందని అక్కడ ఉండలేక నన్ను వదిలేసి ఇంటికి వచ్చేసిందని చెప్పారు.
ఇలా త్రివిక్రమ్ కెరీర్ గురించి.. సినిమాల గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనక్కర్లేదు. కానీ త్రివిక్రమ్ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా త్రివిక్రమ్ సతీమణి గురించి కానీ.. ఆవిడ గురించి నిజాలు చాలా తక్కువ మంది తెలుసుకుని ఉంటారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సతీమణి పేరు సౌజన్య. త్రివిక్రమ్ శ్రీనివాస్ సౌజన్యను 2002లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఈమె ఇంకెవరో కాదు.. స్వయానా పాటల రచయిత పద్మ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కుమార్తె. సౌజన్య కేవలం హౌజ్ వైఫ్ మాత్రమే కాదు చాలా టాలెంటెడ్ ఉమెన్. సౌజన్య ఒక క్లాసికల్ డ్యాన్సర్. ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు.
త్రివిక్రమ్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్లవుతున్న కూడా ఇప్పటి వరకు భార్య సంబంధించిన విషయాలు మాత్రం బయటికి రాలేదు. మూడేళ్ల క్రిందట రవీంద్ర భారతిలో డాన్స్ చేసే వరకు త్రివిక్రమ్ భార్య సౌజన్య ఇంత మంచి డాన్సర్ అనే విషయం ఎవరికీ తెలియలేదు. 2018లో ఈమె రవీంద్ర భారతిలో భరతనాట్యం డాన్స్ ప్రదర్శన ఇవ్వటం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…