మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకి ఎన్ని సూపర్ హిట్స్ అందించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మాటలు అందించిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమా ద్వారా డైరెక్టర్ గా మారారు.తరుణ్ , శ్రేయ జంటగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా భారీ వసూళ్ళను రాబట్టడంతో త్రివిక్రమ్ పేరు మోరు మ్రోగింది. ఇక అప్పటి నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్గా కూడా ఎదిగాడు. నవంబర్ 7వ తేదీన త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో నాలుగవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు నువ్వే నువ్వే సినిమాని విడుదల చేయబోతున్నారు.
అయితే త్రివిక్రమ్ .. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి హిట్ కొట్టారు. మరి త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా అలాంటి సినిమాలు విడుదల చేయకుండా నువ్వే నువ్వే ఎందుకు రిలీజ్ చేస్తున్నారనే ఆలోచనలో ఉంది. అందుకు కారణం పెద్ద హీరోల సినిమాలు విడుదల చేస్తే ఆయా హీరోలు హైలైట్ అవుతారు. కాని తన బర్త్ డే రోజు త్రివిక్రమ్ పేరు ఎక్కువ వినపడాలని నువ్వే నువ్వే చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారట. ఇందులో ప్రధాన పాత్రధారలు ఇప్పుడు లైమ్ లైట్లో లేరు కాబట్టి త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అందుకే ఈ ఆలోచన చేశారని సమాచారం.
ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ సినిమాను ఈ ఏడాది చివరిలోపు ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాను 2023 మార్చిలో విడుదల చేయాలని ఒక ప్లాన్ అయితే ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్తో వీలైనంత తొందరగా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సక్సెస్ కావడంతో తరువాత సినిమాలను కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరపైకి తీసుకురావాలి అని ఆలోచనతో ఉన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…