Train : థ‌ర్డ్ ఏసీ టికెట్ ఉన్నా లోప‌లికి ఎక్క‌లేని ప‌రిస్థితి.. ఒళ్లు మండి ఏం చేశాడంటే..!

Train : పండుగ‌లు వ‌స్తే రైళ్ల‌లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. రిజ‌ర్వేష‌న్ ఉన్నా కూడా జ‌నాల ర‌ద్దీ వ‌ల‌న మ‌న సీటు వ‌ర‌కు కూడా వెళ్ల‌లేని ప‌రిస్థితి. దీపావళి సందర్భంగా రైల్లో గుజరాత్‌లోని వడోదర నుంచి మధ్యప్రదేశ్‌లోని రత్లాం వెళ్తున్న అన్షుల్‌ శర్మ అనే ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. థర్డ్‌ ఏసీ టికెట్‌ బుక్ చేసుకున్నా, కంపార్ట్‌మెంట్ మొత్తం ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయింది. కనీసం లోపలికి అడుగు పెట్టడానికి వీలులేకుండా డోర్‌ దగ్గర ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. దీంతో ఆ వ్య‌క్తి రైల్వేపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.భారతీయ రైల్వే నుండి తన టిక్కెట్‌ డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగాడు.

ట్వీట్ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేసిన అన్షుల్…రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ, ‘నాకు రూ.1173.95 పూర్తి వాపసు కావాలి’ అని అన్షుల్ రాశారు.అతను డీఆర్ఎం వడోదరను కూడా ట్యాగ్ చేశాడు. అన్షుల్ తన ట్వీట్‌లో కొన్ని వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేశాడు.ఇందులో స్టేషన్‌లో భారీ గుంపు కనిపిస్తుంది.‘నా దీపావళిని నాశనం చేసినందుకు ధన్యవాదాలు’ అని తన ట్వీట్‌లో రాశాడు.పోలీసుల సహాయం లేదని, రైలులో కాలు పెట్టేందుకు కూడా వీలు లేకుండా రిజర్వేషన్ కోచ్ లోకి ఎక్కార‌ని అన్నాడు. తనలాగే రైలు ఎక్కలేని వారు ఇంకా చాలా మంది ఉన్నారని తెలిపాడు.అతను ఇంకా ఇలా వ్రాశాడు, ‘కార్మికుల గుంపు నన్ను రైలు నుండి బయటకు విసిరింది. వారు తలుపులు మూసివేశారు.

Train what a passenger did even if he had 3rd ac ticket
Train

లోపలికి ఎవ‌రిని అనుమతించలేదు.ఇదంతా చూసి పోలీసులు నవ్వుతూ నాకు సహాయం చేయడానికి నిరాకరించారు.ఏసీ కోచ్‌లోనూ భారీగా జనం ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రతకు ఏం చర్యలు తీసుకున్నారు’ అని యాజమాన్యంపై ప్రశ్నలు సంధించారు.అన్షుల్ ట్వీట్‌కు డీఆర్ఎం వడోదర నుంచి రిప్లై వచ్చింది. మెరుగైన సహాయం కోసం వివరాలను అందించాలని కోరారు.అతడికి లైఫ్ టైమ్ ఫ్రీ జర్నీ అందించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అన్షుల్ దెబ్బ‌కి రైల్వే దిగి వ‌చ్చింద‌ని చెప్పాలి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 weeks ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago