TECNO POP 6 Pro : మొబైల్స్ తయారీదారు టెక్నో తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి అందిస్తుందని పేరుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను విడుదల చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తూ వస్తోంది. ఇక తాజాగా అలాంటిదే మరొక ఫోన్ను విడుదల చేసింది. టెక్నో పాప్ 6 ప్రొ పేరిట ఈ ఫోన్ విడుదల కాగా.. దీంట్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ధర కూడా చాలా తక్కువ కావడం విశేషం. ఇక ఇందులోని ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
టెక్నో పాప్ 6 ప్రొ స్మార్ట్ ఫోన్లో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో 2 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెసర్ను అమర్చారు. దీంట్లో 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ లభిస్తున్నాయి. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ను ఇందులో అందిస్తున్నారు. వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీని ఫ్లాష్ సదుపాయం కూడా ఉంది.
ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎఫ్ఎం రేడియో, 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0 వంటి ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. ఇక ధర విషయానికి వస్తే.. టెక్నో పాప్ 6 ప్రొ స్మార్ట్ ఫోన్ ధర రూ.6,099 ఉండగా.. దీన్ని అమెజాన్లో విక్రయిస్తున్నారు. అయితే ఎస్బీఐ కార్డులతో ఈ ఫోన్పై అదనంగా 10 శాతం డిస్కౌంట్ను పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.5,489 అవుతుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…