Team India : టీమిండియాని వరుస పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల టీ 20 వరల్డ్ కప్లో దారుణంగా ఆడి సెమీస్కి ఇంటి బాట పట్టిన ఇండియా న్యూజిలాండ్లో జరిగిన వన్డే సిరీస్లో చెత్త ప్రదర్శన కనబరిచి సిరీస్ కోల్పోయింది. ఇక రీసెంట్గా బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ను బంగ్లాదేశ్ చిత్తుచేసింది. ఆఖర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. బంగ్లా ఆల్రౌండర్ మెహీది హసన్ (38) చివరి వరకు క్రీజ్లో నిలబడి జట్టును గెలిపించాడు. ముస్తాఫిజూర్ రెహ్మాన్ (10)తో కలిసి ఆఖరి వికెట్కు అజేయంగా 54 పరుగులు జోడించి విజయ తీరాలకు చేర్చాడు.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 41.2 ఓవర్లలో కేవలం 186 పరుగులకే ఆలౌట్ అయింది. 187పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆ లక్ష్యాన్ని చేరుకొని తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 2022 టీమిండియాకి బ్యాడ్ ఇయర్ అనే చెప్పాలి. ఏడాది ప్రారంభంలో, ఇండియా జట్టు దక్షిణాఫ్రికాతో టెస్ట్ మరియు వన్డే మ్యాచ్లలో ఓడిపోయారు. ఇంగ్లండ్ జట్టు మంచి స్థితిలో లేనప్పటికీ ఐదో టెస్టులో ఇంగ్లండ్ను ఓడించలేకపోయారు భారత ఆటగాళ్లు. ఆసియా కప్లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరిచి ఫైనల్కు చేరుకోలేకపోయింది.
విరాట్ కోహ్లి స్థానంలో బీసీసీఐ రోహిత్ శర్మను కెప్టెన్గా నియమించిన తర్వాత, టీం ఇండియా పేలవమైన క్రికెట్ని ఆడుతుంది., జట్టుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో మరియు అందుబాటులో ఉన్న ప్రతిభను ఉపయోగించడంలో కెప్టెన్ అసమర్థతను ఎత్తిచూపింది. ఏడాది చివరి నెలలో వారు మరొ చెత్త ప్రదర్శన కనబరచి క్రికెట్ ప్రేమికులకి చేదు జ్ఞాపకం మిగిల్చారు. అయితే బంగ్లాతో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ విడిచిన సులవైన క్యాచ్తో ఊపిరి పీల్చుకున్న హసన్ ఫోర్లు, సిక్సర్లతో బంగ్లాను గెలిపించాడు. గతంలో కూడా ఇలాంటి తప్పులు చేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…