T20 World Cup 2022 : ఆస్ట్రేలియా వేదికగా అడిలైడ్లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ కష్టం మీద విజయం సాధించింది. వరుణుడు అడ్డంకిగా మారిన ఈ మ్యాచ్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్లు రాణించారు. 44 బంతులు ఆడిన కోహ్లి 8 ఫోర్లు, 1 సిక్స్తో 64 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
అలాగే కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహముద్ 3, షకిబ్ అల్ హసన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మొదటి 6 ఓవర్ల వరకు దూకుడుగా ఆడింది. వారి ఆటను చూస్తే భారత్ ఓడిపోవడం ఖాయమని అనుకున్నారు. కానీ వర్షం పడింది. దీంతో ఓవర్లను కుదించారు. బంగ్లా టార్గెట్ను 16 ఓవర్లకు 151 గా నిర్దేశించారు.
అయితే వర్షం అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ నిలకడగా ఆడలేకపోయారు. భారత బౌలర్లు విజృంభించడంతో వికెట్లను సమర్పించుకున్నారు. కానీ చివరి ఓవర్లలో బ్యాట్స్ మెన్ భారత ప్లేయర్లను టెన్షన్ పెట్టించారు. వరుసగా వికెట్లు పడుతున్నా బౌండరీలు సాధించారు. అయితే మ్యాచ్ చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. అయినప్పటికీ పరుగులను సాధించడంలో బంగ్లా వెనుకబడింది. దీంతో ఆ జట్టు 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో బంగ్లాపై భారత్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇక భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. అలాగే మహమ్మద్ షమీకి 1 వికెట్ దక్కింది. అయితే మ్యాచ్లో చివరి ఓవర్ వరకు బంగ్లాదేశ్ జట్టు బౌండరీలను సాధిస్తూనే ఉంది. దీంతో తీవ్ర ఉత్కంఠ కలిగింది. ఒక దశలో బంగ్లాదేశ్ గెలుస్తుందేమో.. భారత్ ఇంటికేనని అనుకున్నారు. కానీ ఎట్టకేలకు చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. ఇక భారత్ తన తదుపరి మ్యాచ్లో జింబాబ్వేతో ఆడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 6వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…