Smitha Sabarwal : ప్రభుత్వ అధికారుల బదిలీలు అనేది సర్వసాధారణంగా జరగడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొన్నిసార్లు భారీగా ఐఏఎస్,ఐపీఎస్ ల బదిలీలు జరుగుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో పోస్టింగ్స్ విషయంలో అనేక సంచలన, ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారీగా తొలిసారిగా భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరుగుతున్నాయి. అయితే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కి స్థాన చలనం అవుతుందా లేదా అనేది అందరిలో సందేహం ఉండేది. కాని ఆమెకి కూడా బదిలీ అయింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా 26 మంది ఐఎఎస్ అధికారులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది. సీనియర్ అధికారులు స్మిత సబర్వాల్, రాహుల్ బొజ్జా, అహ్మద్ నదీం, బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, క్రిస్టీనా జెడ్ ఛొంగ్తు, సందీప్ కుమార్ సుల్తానియా, డీ కృష్ణ భాస్కర్, జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎం రఘునందన్ రావు, బీ వెంకటేశంతో పాటు పలువురు అధికారులు బదిలీ అయ్యారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డీజీ బెన్హర్ మహేష్ దత్ ఎక్కా గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అక్కడ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను నిర్వహిస్తోన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రిలీవ్ అయ్యారు. కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీంను ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
అయితే స్మిత కొద్ది రోజుల క్రితం సీతక్కని కలిసింది. ఆ రోజు ఆమె ముందు కాలి మీద కాలు వేసుకొని కూర్చున్నట్టుగా ఓ ఫొటో వైరల్ అయింది. ఈ ప్రభావంతోనే స్మిత సబర్వాల్ కూడా బదిలీ అయిందని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న స్మిత సబర్వాల్ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆమెను తెలంగాణ ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. అక్కడ ఎఫ్ఏసీగా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియా రిలీవ్ అయ్యారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…