Shriya Saran : సీనియర్ హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. వివాహం అయ్యి ఒక పాపకు కూడా జన్మనిచ్చాక శ్రియ శరణ్ ఇప్పుడు ఇంకా సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి బియ్యాల పాపారావు దర్శకత్వంలో తెరకెక్కిన మ్యూజిక్ స్కూల్ సినిమా ప్రమోషన్స్ లో శ్రియ శరణ్ చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. 22 సంవత్సరాల నుంచి విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.స్టార్ హీరోలకు తల్లి పాత్రల్లో నటించడానికి సైతం ఆమెకు అభ్యంతరం లేదని తెలుస్తోంది. సీనియర్ హీరోలకు సైతం ఆమె బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్ స్కూల్ చిత్రం బై లింగ్వల్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కింది. శర్మన్ జోషి, నటి లీలా సామ్సన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు . ఈనెల 12న మూవీ తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శ్రియ ప్రమోషనల్ కార్యక్రమాలలో చాలా యాక్టివ్గా పాల్గొంటుంది. ఇది ఈ తరం విద్యార్థులు చూడాల్సిన ముఖ్యమైన చిత్రం. చదువు, పరీక్షలు అంటూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు అని చెప్పిన శ్రియ అందుకు కారణం మానసిక ప్రశాంతత లేకపోవడమే అని అన్నారు.
భవిష్యత్తులో ఈ సినిమాను తన కూతురు రాధ చూస్తే గర్వంగా ఫీలవుతుందని అన్నారు. పిల్లల మీద ఓవర్ ఎక్స్ పెక్టేషన్ తో తల్లిదండ్రులు ఒత్తిడి పెడుతున్నారన్నారని, తాను ఓ మంచి తల్లిదండ్రులను కలిగి ఉన్నానని, అందుకే తాను ఏది చేయాలనుకుంటే అది చేశానని ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఇంటి నుండి బయటకు రావాలంటే కొందరు పోరాటాలు చేస్తున్నారని వాపోయింది. చిత్ర కథ వినగానే అలాంటి విషయాలను అర్థం చేసుకోగలిగానని పేర్కొంది శ్రియ. రీసెంట్గ హైదరాబాద్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరగగా, ఆ కార్యక్రమంలో క్యూట్ డ్రెస్ లో మెరిసింది.
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…
ఏపీలో వరదలు సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొందరు ఇప్పటికీ దిక్కుతోచని స్థితిలో…
YS Jagan : ఈ ఎన్నికలలో ఘోరంగా ఓడిన జగన్ ప్రతి సందర్భంలో ప్రభుత్వంపై ఏదో ఒక విధంగా విమర్శలు…
Harish Rao : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఇష్టమొచ్చినట్టు…
గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం వలన చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…
YS Sharmila : వైఎస్ షర్మిళ ఇటు తెలంగాణ, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…