Sameera Reddy : తెలుగు చిత్ర పరిశ్రమలో అందంతో పాటు యాక్టింగ్ అదరగొట్టే సామర్ధ్యం ఉన్నా.. కూడా కొంత మంది అమ్మాయిలు మాత్రం ఫ్లాప్ హీరోయిన్లుగానే ఉంటున్నారు. ఇక వారికి అవకాశాలు రాకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమైన సందర్భాలు లేకపోలేదు. అలాంటి భామలలో సమీరా రెడ్డి ఒకరు. తెలుగు నేపథ్యం ఉన్న కుటుంబంలోనే సమీరా రెడ్డి జన్మించింది. చదువుకుంటోన్న సమయంలోనే ఈ అమ్మడు మోడల్గా కెరీర్ను మొదలెట్టింది. ఆ తర్వాత ‘మైనే దిల్ తుజ్కో దియా’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించింది. తద్వారా దేశ వ్యాప్తంగా ఫేమస్ అవడంతో పాటు ఆమెకు చాలా ఆఫర్లు లభించాయి.
సమీరా రెడ్డి.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నరసింహుడు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్గా పరిచయం అయింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ‘జై చిరంజీవ’ అనే మూవీ చేసినా నిరాశే ఎదురైంది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్తో ‘అశోక్’ చేసినా డిజాస్టర్గానే మిగిలిపోయింది. కెరీర్ను ఆశించిన విధంగా సాగించలేకపోయిన సమీరా రెడ్డి 2014లో అక్షయ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఈ మధ్యలో మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగినా.. అది మాత్రం జరగలేదు. పైగా వెంట వెంటనే ఈ సీనియర్ హీరోయిన్ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి మాతృత్వాన్నే ఎంజాయ్ చేస్తూ ఎక్కువగా ఫ్యామిలీతోనే గడుపుతోంది.
అయితే తాజాగా సమీరా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్పై తన ప్రేమని వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ డమ్ దక్కించుకోవడంతో ఆనందంగా ఉందని పేర్కొంది. నాటు నాటు పాటకి నా కూతురు, కొడుకు ఒకటే డ్యాన్స్ చేస్తుంటారు. రాజమౌళి గారిని చూస్తే వావ్ అనాలని అనిపిస్తుంది. జై చిరంజీవలోని జై జై గణేష్ పాట వినాయక చవితికి మారుమ్రోగిపోతుండడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందని పేర్కొంది. త్వరలో సినిమాల్లోకి సమీరా రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…