Samantha : ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది సమంత. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఓవర్ నైట్లో ఆమెకి ఏదీ రాలేదు. ఈ పేరు ప్రఖ్యాతలు పొందడం కోసం చాలా కష్టపడింది. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. సినిమా పరిశ్రమలోను, వ్యక్తిగత జీవితంలోను సమంతకు ఎదురైన ఆటుపోట్లు అన్నీ ఇన్నీ కావు. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంతను ఒక్కొక్కరు దారుణంగా ట్రోల్స్ చేసిన కూడా అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది.
ఒకప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసుకుంటూ వచ్చింది సమంత. అయితే కొన్నాళ్లుగా చాలా సైలెంట్ అయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఏం చేస్తుందనే సమాచారం కూడా ఎవరి దగ్గర లేదు. అయితే సమంత వేద పాఠశాలలో కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయగా, వాటికి సంబంధంచిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎందుకోసం సమంత ఇలా సడెన్గా పూజలు చేస్తుందనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుపుతున్నారు.
తన మాజీ భర్త నాగ చైతన్యతో విడిపోయినప్పటి నుండి సమంత చాలా మూడీగా కనిపిస్తుంది. వెండితెరపై సంతోషంగా కనిపించినప్పటికీ, ఆమె లోపల బాధను అనుభవిస్తోందని అంటున్నారు. ఆమె పూజలు చేయడం వెనుక ఈ కారణాలు కూడా ఉండి ఉండవచ్చు అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం సమంత బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె అక్షయ్ కుమార్ సరసన ఓ సినిమా చేస్తోంది. అలాగే సమంత నటించిన యశోద, శాకుంతలం, ఖుషీ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…